Sakshi News home page

మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా ఏటీ వేరియంట్

Published Wed, Apr 27 2016 12:59 AM

మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా ఏటీ వేరియంట్

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘క్రెటా’లో కొత్తగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పెట్రోల్ ఆప్షన్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.12.87 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రియర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్స్, స్మార్ట్‌కీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కాగా హ్యుందాయ్ ఇప్పటికే డీజిల్ ఆప్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.14.5 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ అలాగే అన్ని క్రెటా వేరియంట్లలోనూ డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Advertisement

What’s your opinion

Advertisement