సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ చికిత్సలో వినియోగించే అబ్రాక్సిస్ ఔషధ పేటెంట్ విషయంలో రాష్ట్రానికి చెందిన నాట్కో ఫార్మాకు అడ్డంకి తొలగిపోయింది. అమెరికా సంస్థ అబ్రాక్సిస్ బయోసెన్సైస్ ఔషధ ఉత్పత్తి అయిన అబ్రాక్సేన్కు పేటెంట్ మంజూరులో చుక్కెదురయింది.
అబ్రాక్సేన్ తయారీలో మేథో హక్కులకేమీ భంగం కలగడం లేదని, ఉత్పత్తి విధానం సరళమైనది కావడంతో అబ్రాక్సిస్కు పేటెంట్ జారీ చేయరాదని నాట్కో కంపెనీ పేటెంట్ సంస్థ ఎదుట తన వాదనలు వినిపించింది. నాట్కో వాదనలతో ఏకీభవించిన పేటెంట్ కార్యాలయం అబ్రాక్సేన్కు పేటెంట్ నిరాకరిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. ఇది దేశీయ కంపెనీలకు ఎంతో ఊరట కలిగించే పరిణామం.వివరాల్లోకెళితే... అబ్రాక్సేన్కు సరిసమానమైన బయోసిమిలర్ అల్బూపాక్స్ను నానోటెక్నాలజీ ఆధారంగా నాట్కో సంస్థ 2008లోనే ఉత్పత్తి చేసింది.
టాక్సిన్లు (విష పూరితాలు) అధికంగా ఉండే ఈ ఔషధ వినియోగం ఎంత మాత్రం సురక్షితం కాదని అబ్రాక్సిస్ లోకల్ పార్ట్నర్ బెంగుళూరుకు చెందిన బయోకాన్ సంస్థ డ్రగ్ కంట్రోలర్కు ఫిర్యాదు చేసింది. దీంతో నాట్కో ఆ ఉత్పత్తిని ఉపసంహరించుకుంది. 2011లో డ్రగ్ కంట్రోలర్ అభ్యంతరాలను తోసిరాజని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాట్కో ఔషధ ఉత్పత్తికి అనుమతించినా సంస్థ ముందుకు రాలేదు. పేటెంట్ కార్యాలయంలో పోరాటం తప్ప ఉత్పత్తి మార్కెట్లోకి తెచ్చే విషయంలో ఉత్సాహం చూపించలేదు.
అడ్డు తొలిగింది.. అయినా నిరుత్సాహమే...
ఇదీ రాష్ట్రానికి చెందిన నాట్కో ఫార్మా పరిస్థితి. కేన్సర్స్ చికిత్సకు సంబంధించి కొత్త ఉత్పత్తులు మార్కెట్లో తెచ్చేందుకు ఎప్పుడూ ముందుండే నాట్కో అల్బూపాక్స్ ఔషధ విషయంలో జంకుతోంది. రూ 200 కోట్ల రొమ్ము కేన్సర్ మార్కెట్లో నాట్కో పొందాల్సిన ప్రతి ఫలాన్ని పోటీ సంస్థలైన సిప్లా, పెనేషియా బయోటెక్, ఫ్రెసీనియస్ కాబీ ఆంకాలజీ ఇండియా (గతంలో డాబర్ ఇండియా ) లాంటి సంస్థలు అనుభ విస్తున్నాయి. మేధో హక్కుల పోరాటం చేస్తున్న నాట్కో ఫార్మా మాత్రం ఈ డ్రగ్ తయారీపై వెనకంజ వేయడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ విషయమై కంపెనీ అధికారుల్ని సంప్రదించడానికి ప్రయత్నించినా, వారు అందుబాటులోకి రాలేదు.
ఏడాదిలో మూడింతలు పెరిగిన నాట్కో షేర్...
నాట్కో ఫార్మా స్టాక్ మార్కెట్లో ఒక ఏడాదిలో మూడింతలు పెరిగింది. పేటెంట్ తీర్పు ఈ నెల 18న వెల్లడైంది. 20 వ తేదీన కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ట ధర రూ. 1210కి చేరింది. గత నెలరోజులుగా చూస్తే షేర్ కనిష్ట ధర రూ. 725.90 కాగా గరిష్ట ధర రూ. 725.90గా నమోదైంది. ఇక గత వారం రోజుల్లో షేర్ ధర మాంచి జోరు మీదుంది. కనిష్ట ధర రూ. 941 కాగా గరిష్ట ధర రూ. 1210. అంటే వారం రోజుల్లో షేర్ ధర రూ.270 పెరిగింది. నెల రోజుల వ్యవధిలో రూ 485 పెరగటం గమనార్హం. షేర్ 52 వారాల కనిష్ట ధర రూ. 430 గతేడాది జూలైలో నమోదైంది.
నాట్కోకు తొలిగిన అడ్డంకి
Published Wed, Jun 25 2014 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement