ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో పాటు, ఎఫ్డీఐలకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 241పాయింట్ల లాభంతో 26,866 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,238పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో 1.97శాతం, రియాల్టీ 1.05శాతం , మెటల్ 1.40శాతం లాభపడుతుండగా , నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్లో టాటాస్టీల్ 3.47శాతం, అంబుజా సిమెంట్ 2.88శాతం, టాటామోటార్స్ 3.92శాతం లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్లో యాక్సెస్ బ్యాంక్ 0.88శాతం, ఏసియన్ పేయింట్స్ 0.66శాతం, సన్ ఫార్మా 0.65శాతం నష్టపోయాయి.