న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) క్యూ4(జనవరి-మార్చి)లో నామమాత్ర వృద్ధితో రూ. 310 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 308 కోట్లను ఆర్జించింది. మొండిబకాయిలకు కేటాయింపులు పెరగడం, అధిక పన్ను చెల్లింపుల కారణంగా లాభాలు పరిమితమైనట్లు బ్యాంకు చైర్మన్ ఎస్ఎల్ బన్సల్ పేర్కొన్నారు. ఈ కాలంలో మొండిబకాయిల ప్రొవిజన్లు రూ. 498 కోట్ల నుంచి రూ.728 కోట్లకు పెరిగాయి.
వడ్డీ ఆదాయం 8% అప్
ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) దాదాపు 8% పుంజుకుని రూ. 1,309 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 4,565 కోట్ల నుంచి రూ. 5,655 కోట్లకు ఎగసింది. కాగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.72% నుంచి 2.78%కు బలపడ్డాయి. మరోవైపు నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.27% నుంచి 2.82%కు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 3.60 తుది డివిడెండ్ను బ్యాంకు బోర్డు ప్రతిపాదించింది. కాగా, పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు నికర లాభం 14% క్షీణించి రూ. 1,139 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాదిలో రూ. 1,328 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే ఆదాయం మాత్రం రూ. 19,359 కోట్ల నుంచి రూ. 20,963 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంకు షేరు 1% తగ్గి రూ. 247 వద్ద ముగిసింది.
ఓబీసీ నికర లాభం 310 కోట్లు
Published Thu, May 1 2014 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement