- క్యూ3లో లాభం 91 శాతం క్షీణత
- రూ.19.56 కోట్లకు పరిమితం
- 5.53%కి పెరిగిన స్థూల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కు మొండి బకాయిల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో నికర లాభం ఏకంగా 91.2 శాతం దిగజారి రూ.19.56 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం రూ.224 కోట్లుగా నమోదైంది. కాగా, డిసెంబర్ చివరినాటికి ఓబీసీ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 5.43 శాతానికి పెరిగిపోయాయి.
2013 డిసెంబర్ చివరికి స్థూల ఎన్పీఏలు 3.87 శాతం మాత్రమే ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా2.91 శాతం నుంచి 3.68 శాతానికి ఎగబాకాయి. బ్యాంక్ మొత్తం ఆదాయం 7.8 శాతం వృద్ధితో రూ. 5,064 కోట్ల నుంచి రూ.5,459 కోట్లకు పెరిగింది. నిర్వహణ వ్యయాలు రూ.712 కోట్ల నుంచి రూ.794 కోట్లకు చేరాయి.
మొండిబకాయిలకు అధిక ప్రొవిజనింగ్ కేటాయింపులతోపాటు సాంకేతికపరమైన కొన్ని కారణాలు కూడా క్యూ3లో లాభాలు భారీగా పడిపోయేందుకు కారణమైందని ఓబీసీ ఎండీ, సీఈఓ, అనిమేష్ చౌహాన్ పేర్కొన్నారు. జూన్లో కొన్ని మొండి బకాయిలను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని లాభంగా చూపించామని... అయితే, ఆర్బీఐతో సంప్రతింపుల అనంతరం దీన్ని పొరపాటుగా గుర్తించి, రూ.137 కోట్లను లాభాల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు.
మరోపక్క, డిసెంబర్ క్వార్టర్లో రూ.1,340 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారగా.. రూ.2,050 కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించినట్లు చౌహాన్ వివరించారు. ఇక క్యూ3లో మొండిబకాయిల కోసం రూ.885 కోట్లను బ్యాంక్ ప్రొవిజనింగ్గా కేటాయించింది. క్రితం క్యూ3లో ఈ మొత్తం రూ.561 కోట్లుగా ఉంది. కాగా, ఇటీవలే(2014 డిసెంబర్ 31న) బ్యాంక్ కొత్త సీఈఓ, ఎండీగా చౌహాన్ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆఖరి త్రైమాసికం(క్యూ4) కూడా మందకొడిగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.
భారీగా పడిన షేరు: ప్రతికూల ఫలితాల కారణంగా ఓబీసీ షేరు ధర కుప్పకూలింది. గురువారం బీఎస్ఈలో ఒకానొక దశలో 11 శాతం పైగా క్షీణించి రూ.279 కనిష్టాన్ని తాకింది. చివరకు 10.81 శాతం నష్టంతో రూ.281 వద్ద ముగిసింది. గురువారం ఒక్కరోజులోనే బ్యాంక్ మార్కెట్ విలువ రూ.1,182 కోట్లు ఆవిరై.. రూ.8,203 కోట్లకు పడిపోయింది.
ఓబీసీకి మొండిబకాయిల షాక్
Published Fri, Jan 30 2015 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement