నిజామాబాద్‌లో పాజిటివ్ హోమియో థైరోసెల్ | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో పాజిటివ్ హోమియో థైరోసెల్

Published Wed, Nov 19 2014 1:03 AM

నిజామాబాద్‌లో పాజిటివ్ హోమియో థైరోసెల్

హైదరాబాద్: పాజిటివ్ హోమియోపతి సంస్థ నిజామాబాద్‌లో అంతర్జాతీయ థైరాయిడ్ క్లినిక్, థైరో సెల్‌ను మంగళవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ ఎంపీ, కె. కవిత గారు వచ్చారని పాజిటివ్ హోమియో గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంఎల్‌ఏ జిగాల గణేష్‌గుప్తా గారు, మేయర్ ఆకుల సుజాత గారు కూడా పాల్గొన్నారని సంస్థ ఎండీ, డాక్టర్ ఎ. ఎం. రెడ్డిగారు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు థైరాయిడ్ రుగ్మతలకు చక్కని చికిత్స అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ థైరోసెల్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేశామని వివరించారు. పాజిటివ్ హోమియోపతి అన్ని బ్రాంచీల్లో థైరాయిడ్‌పై కౌన్సిలింగ్, సలహాలు నెలరోజుల పాటు ఇస్తామని తెలిపారు.

Advertisement
Advertisement