మైలాన్ సీఐఓగా తెలుగుతేజం | Sakshi
Sakshi News home page

మైలాన్ సీఐఓగా తెలుగుతేజం

Published Sun, Dec 20 2015 11:46 AM

మైలాన్ సీఐఓగా తెలుగుతేజం

హైదరాబాద్: మరో తెలుగుతేజం మెరిశారు. బహుళజాతి ఔషధ కంపెనీ మైలాన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ)గా తెలుగు వ్యక్తి రామ్కుమార్ రాయపురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మైలాన్ కంపెనీ రామ్కుమార్ నియామకాన్ని ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా బానపురంలో ఆయన జన్మించారు. కాకినాడ జేఎన్టీయూలో బి.టెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా నార్త్ కరోలినాలోని క్లేమన్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు.

ఆ తర్వాత ర్యాన్బాక్సీ సంస్థలో సీఐఓగా విధులు నిర్వహించారు. గత 22 సంవత్సరాలుగా రామ్కుమార్ ఔషధ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 15 నెలల క్రితమే ఆయన మైలాన్ కంపెనీలో చేరారు. అనతికాలంలోనే రామ్కుమార్ కీలక పదవిని చేపట్టే అవకాశం వచ్చింది. ఈ కంపెనీలో ఐటీ కార్యకలాపాలను రామ్కుమార్ పర్యవేక్షిస్తారు.

Advertisement
Advertisement