24వేల మార్కు దాటిన సెన్సెక్స్

13 May, 2014 12:22 IST|Sakshi
24వేల మార్కు దాటిన సెన్సెక్స్

ముంబయి : స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 24వేల పాయింట్ల మార్కును దాటింది. మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి.  తొలిసారిగా సెన్సెక్స్ 24 వేల పాయింట్లు  దాటగా, 7,100 పాయింట్లు నిఫ్టీ దాటింది. 500 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 150 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది.   కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో జోరుమీదున్న ఆపరేటర్లు మరోసారి విజృంభించారు. దీంతో స్టాక్ బుల్ మళ్లీ కాలు దువ్వింది. ఫలితం.... వరుసగా మూడో రోజూ కొత్త రికార్డులు నమోదయ్యాయి.

 

మరిన్ని వార్తలు