కఠిన చర్యలు తీసుకోవలసిందే..! | Sakshi
Sakshi News home page

కఠిన చర్యలు తీసుకోవలసిందే..!

Published Sat, Jun 2 2018 1:02 AM

Tough action needed to revive Air India, says Anand Mahindra - Sakshi

ముంబై:  ఎయిరిండియా గట్టెక్కాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఎయిరిండియా చైర్మన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిడులు ఉండరాదని ఎయిరిండియాకు గతంలో బోర్డ్‌ సభ్యునిగా వ్యవహరించిన  ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

ఎయిరిండియా వాటా విక్రయానికి బిడ్‌లు వేయడానికి గత నెల 31న గడువు ముగియడం, వాటా కొనుగోలు కోసం ఒక్క సంస్థ కూడా ముందుకు రాకపోవటం తెలిసిందే. ఢిల్లీ మెట్రో, కొంకణ్‌ రైల్వేకు పనిచేసిన ఈ.శ్రీధరన్‌ వంటి సత్తా ఉన్న వ్యక్తిని ఎయిర్‌ ఇండియా చైర్మన్, సీఈఓగా నియమించాలని, ఆ వ్యక్తి తీసుకునే కఠిన చర్యలకు పూర్తిగా మద్దతివ్వాలని సూచించారు.

Advertisement
Advertisement