విజయనగరం, బొబ్బిలి రూరల్: తనకు పదోన్నతి వచ్చినా రిలీవింగ్ ఇవ్వకపోవడం, తనకు పోస్టింగ్ ఇస్తానన్న ప్రదేశానికి ఇవ్వకపోగా, తనకు ఇస్తామన్న ప్రదేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు వేరేవారిని సిఫార్సు చేస్తుండడంతో మనస్థాపం చెంది బొబ్బిలి ట్రజరీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వి.సరస్వతి సోమవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో ‘బొబ్బిలికోటలో బేబీపంచాయతీ’ పేరిట సాక్షి కథనం ప్రచురించింది. స్థానిక ప్రజాప్రతినిధులు ఒకే పోస్టుకు అనేకమందికి సిఫార్సులు ఇవ్వడం, ప్రశ్నించిన వ్యక్తిపై దాడికిపాల్పడడం పాఠకులకు విధితమే. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేకెత్తింది. కాగా తాజాగా అదే సంఘటనలో బాధితురాలు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది.
బాధితురాలు సరస్వతి తెలిపిన వివరాల ప్రకారం తనకు ఎస్టీఓగా పదోన్నతి వచ్చిందని, సాలూరులో పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా స్థానిక మంత్రి, ఆయన సోదరులను కలిశామని, వారూ మాట ఇచ్చారని, అయితే గతంలో తనసోదరుడిపై కోటలో దాడిజరగడం, దానిపై సాక్షి దినపత్రికలో కథనం రావడంతో తమపై కక్షకట్టిన స్థానిక ప్రజాప్రతినిధులు వేరే వ్యక్తికి సాలూరులో పోస్టింగ్ ఇప్పించి, తనకు శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇస్తామని ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతి ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఆమె ప్రస్తుతం బొబ్బిలి సీహెచ్సీలో చికిత్స పొందుతోంది.
ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
Published Tue, Oct 3 2017 10:53 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement