ప్రేమికులు ఓడిపోయారు.. | Sakshi
Sakshi News home page

ప్రేమికులు ఓడిపోయారు..

Published Thu, Feb 1 2018 9:28 AM

lovers dead in suicide attempt case - Sakshi

పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): మండలంలోని లింగగూడెం శివారులో జనవరి 27న పెట్రోల్‌ పోసుకొని, నిప్పు అంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ప్రేమికులు శివాపురానికి చెందిన ధారావతు సాయి, నల్గొండ జిల్లా దామచర్ల మండలం, ఎల్‌బీ తండాకు చెందిన సునీత బుధవారం మృతి చెందారు. 70 శాతానికి పైగా కాలిన గాయాలతో ఐదు రోజులుగా విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు గంటల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ అవినాష్‌ తెలిపారు.

Advertisement
Advertisement