Sakshi News home page

జిల్లాకు 600 పవర్‌ స్ప్రేయర్లు

Published Wed, Nov 2 2016 12:24 AM

జిల్లాకు 600 పవర్‌ స్ప్రేయర్లు - Sakshi

పవర్‌ స్ప్రేయర్‌ అసలు ధర రూ. 16200..సబ్సిడీ రూ. 8100
కడప అగ్రికల్చర్‌ :  జిల్లాకు ఈ ఏడాదికిగాను మొదటి విడతగా 600 పవర్‌ స్ప్రేయర్లు మంజూరయ్యాయని వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డి ఠాకూర్‌ నాయక్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం  నగరంలోని  కడప డివిజన్‌ కార్యాలయంలో రైతులకు పవర్‌ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. అనంతరం జేడీ మాట్లాడుతూ జిల్లాలోని డివిజన్‌కు 50 పవర్‌ స్ప్రేయర్ల లెక్కన మొత్తం 12 డివిజన్లకు కలిపి 600 మంజూరయ్యాయని వివరించారు. స్ప్రేయర్‌ అసలు ధర రూ. 16200లుకాగా, ఇందులో సబ్సిడీ రూ. 8100లు పోను మిగిలిన రూ. 8100 రైతులు డీడీలను బ్యాంకులో తీసి వ్యవసాయాధికారులకు అందజేయాలన్నారు.  వరి, వేరుశనగ, మిరప, పత్తి తదితర పంటలల్లో ఉత్పన్నమయ్యే తెగుళ్లు, పురుగుల నివారణలో పిచికారి చేయడానికి ఈ స్ప్రేయర్‌ ఉపయోగపడుతుందన్నారు. అనంతరం రైతులకు పలు సూచనలు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కడప డివిజన్‌ అసిస్టెంట్‌ డైరక్టర్‌ ఎవి నరసింహారెడ్డి, ఏఓ గంజికుంట రామకృష్ణ, జేడీ కార్యాలయ టెక్నికల్‌ ఏఓ సురేష్‌కుమార్‌రెడ్డి, ఏఈఓ శ్యాంసుదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement