పవర్ స్ప్రేయర్ అసలు ధర రూ. 16200..సబ్సిడీ రూ. 8100
కడప అగ్రికల్చర్ : జిల్లాకు ఈ ఏడాదికిగాను మొదటి విడతగా 600 పవర్ స్ప్రేయర్లు మంజూరయ్యాయని వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డి ఠాకూర్ నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నగరంలోని కడప డివిజన్ కార్యాలయంలో రైతులకు పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. అనంతరం జేడీ మాట్లాడుతూ జిల్లాలోని డివిజన్కు 50 పవర్ స్ప్రేయర్ల లెక్కన మొత్తం 12 డివిజన్లకు కలిపి 600 మంజూరయ్యాయని వివరించారు. స్ప్రేయర్ అసలు ధర రూ. 16200లుకాగా, ఇందులో సబ్సిడీ రూ. 8100లు పోను మిగిలిన రూ. 8100 రైతులు డీడీలను బ్యాంకులో తీసి వ్యవసాయాధికారులకు అందజేయాలన్నారు. వరి, వేరుశనగ, మిరప, పత్తి తదితర పంటలల్లో ఉత్పన్నమయ్యే తెగుళ్లు, పురుగుల నివారణలో పిచికారి చేయడానికి ఈ స్ప్రేయర్ ఉపయోగపడుతుందన్నారు. అనంతరం రైతులకు పలు సూచనలు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కడప డివిజన్ అసిస్టెంట్ డైరక్టర్ ఎవి నరసింహారెడ్డి, ఏఓ గంజికుంట రామకృష్ణ, జేడీ కార్యాలయ టెక్నికల్ ఏఓ సురేష్కుమార్రెడ్డి, ఏఈఓ శ్యాంసుదర్రావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు 600 పవర్ స్ప్రేయర్లు
Published Wed, Nov 2 2016 12:24 AM
# Tag
Related news
-
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాల్లోకి వెళ్లిందని దుయ్యబట్టారు. 2014 జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిస్కంల నష్టాలు రూ.12,186 కోట్లు కాగా బీఆర్ఎస్ పదేళ్ల పాలన పూర్తయ్యేసరికి ఆ నష్టాల భారం రూ.62 ,461 కోట్లకు చేరిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్య లపై ఆ శాఖ మంత్రిగా తాను చర్చకు సిద్ధమని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని సంస్కరిస్తూ కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తు న్నామని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీర్ఘకాలిక అవసరాల కోసమే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు చేశామనే కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. తాము రూ.13 పెట్టి విద్యుత్ కొనుగోలు చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, యూనిట్ను కేవలం రూ.3.90కు కొంటున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బీఆర్ఎస్ హయంలో రూ.20లకు కూడా విద్యుత్ కొన్నట్టు రికార్డుల్లో నమోదైందని తెలిపారు. ఎన్టీపీసీ నుంచి తాము ఒక యూనిట్ను రూ. 5.60లకు కొనుగోలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కేసీఆర్ హయంలో థర్మల్ విద్యుత్ కొత్త కేంద్రం భద్రాద్రి నుంచి 1080 మెగావాట్లు మాత్రమే వచ్చిందని, ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న 1000 మెగావాట్లను కలిపితే 2080 మెగావాట్లని వివరించారు. 2022లోనే ఛత్తీస్గఢ్ విద్యుత్ ఆగిపోయిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాతే అత్యధిక విద్యుత్ సరఫరా చేశామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ను పవర్ ఐల్యాండ్గా మార్చిన ఘనత కాంగ్రెస్దే 2012లో గ్రిడ్ కుప్పకూలిన తరువాత హైదరాబాద్ను పవర్ ఐల్యాండ్గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని భట్టి స్పష్టం చేశారు. ’’దేశంలోని 20 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లో ఇలాంటి పవర్ ఐలాండ్ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చాం’అని వివరించారు. ఫిబ్రవరి నాటికి యాదాద్రి ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నుంచి 2025 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్కు పర్యావరణ అనుమతులు రావడానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 4000 మెగావాట్ల ఈ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం చూపి కేవలం రెండు నెలల వ్యవధిలోనే యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకువచ్చామని భట్టి తెలిపారు. -
విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. విద్యుత్ రంగాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దడంతోపాటు భవిష్యత్ తరాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రభుత్వం ప్రకటించింది. పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్ధాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను కొత్తగా నెలకొల్పేందుకు తోడ్పాటునందించింది. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో, ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులతో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విద్యుత్ రంగ ప్రగతి ► రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ సీవోడీ పూర్తి చేసుకుని అందుబాటులోకి వచి్చంది. ఈ 1,600 మెగావాట్లతో కలిపి జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. ► ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎన్హెచ్పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ► దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 8,025 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. ► వ్యవసాయానికి వచ్చే 30 ఏళ్ల పాటు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ను కొనసాగించడం కోసం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ► సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్ధ్యం పెరిగింది. ► చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు కొత్తగా వచ్చాయి. ► పట్టణ ప్రాంతాల్లో పోగయ్యే చెత్త నుంచి విద్యుత్ను తయారు చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులనూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. 2021లో గుంటూరులో 15 మెగావాట్ల ప్లాంటు, 2022లో విశాఖలో 15 మెగావాట్ల సామర్ధ్యంతో మరో ప్లాంటు ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్ధాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ► 2023 మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సష్టించే అవకాశం ఉంది. ► గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్యం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగాలలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం నిలిపింది. రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్లు విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన రంగంలో ఎన్నో అవార్డులు ఇంధన భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పలు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను వరుసగా రెండేళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఏపీ ట్రాన్స్కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వచ్చాయి. ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. ‘కన్సూ్యమర్ సరీ్వస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. వీటన్నిటి సాధన వెనుక సీఎం జగన్ ముద్ర, ఆయన ప్రణాళికలు ఉన్నాయి. -
‘పునరుత్పాదక విద్యుత్’.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, విశాఖపట్నం: భారత్లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం (రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో))లో 2021–22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నెడ్క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణారెడ్డి తెలిపారు. కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021–22 నాటికి ఆర్పీవో లక్ష్యాన్ని 21.18 శాతంగా నిర్దేశించగా ఏపీ దాన్ని అధిగవిుంచిందని వివరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), నెడ్క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్లో క్లీన్ గ్రోత్ డ్రైవింగ్ పోర్ట్, ఎనర్జీ ఇంటెన్సివ్లో క్లీన్ ఇన్వెస్ట్మెంట్, కర్బన ఉద్గారాల నియంత్రణలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై శనివారం విశాఖలో సదస్సు జరిగింది. ఇందులో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,008.78 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ రంగంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచామని వివరించారు. ఇందులో సోలార్ పవర్ 38.50 గిగావాట్లు కాగా విండ్ పవర్ 44 గిగావాట్లు ఉందని తెలిపారు. దీంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కింద 36.15 మెగావాట్లు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.97 మెగావాట్లు, చిన్న హైడ్రో ప్రాజెక్టుల నుంచి 106.80 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దేశానికే ఆదర్శం.. 2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పునరుత్పాదక విద్యుత్ ఎగుమతుల పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమణారెడ్డి తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రం 37 శాతంతో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 4,745.60 మెగావాట్ల సామర్థ్యంతో 8 ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. మరో 3,260 మెగావాట్ల సామర్థ్యంతో 4 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే 2,350 మెగావాట్లతో 2 ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో, 59,357 మెగావాట్లతో 47 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం 61 ప్రాజెక్టుల్లో 26,050 మెగావాట్ల సామర్థ్యంతో 23 ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని తెలిపారు. పంప్డ్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. 21 ప్రాంతాల్లో 16.18 గిగావాట్ల ఉత్పత్తికి, 37 ప్రాంతాల్లో 42.02 గిగావాట్ల ఉత్పత్తికి పీఎస్పీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుం బిగించింది.. ఈ సదస్సులో వర్చువల్గా పాల్గొన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.యువరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా విద్యుత్ రంగంలో 51.3 శాతం, రవాణా రంగంలో 13.2 శాతం కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుంబిగించిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోగలమని ఆకాంక్షించారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. అదే ఏడాది నాటికి భారత్లో హైడ్రోజన్ డిమాండ్ 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. ఇది 2050 నాటికి 28 ఎంఎంటీ దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ జె తారకన్, సీఐఐ చైర్మన్ డా.లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
దేశంలో టాప్–10లో ఏపీ డిస్కంలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నాయి. తాజాగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) ప్రకటించిన టాప్ 62 డిస్కంల జాబితాలో ఏపీ డిస్కంలు జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచి ‘ఏ’ గ్రేడ్ సాధించాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, కె.సంతోషరావులు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టు రోజువారీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతల్లేకుండా అందిస్తూ ఏపీ రికార్డులు సృష్టిస్తోంది. దేశ సగటు విద్యుత్ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్ను అందిస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన వినియోగదారుల సేవా రేటింగ్ 2022–23 నివేదిక ప్రకారం.. జాతీయ సగటు విద్యుత్ సరఫరా పట్టణ ప్రాంతాల్లో 23.59 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 21.26 గంటలుగా ఉంది. కానీ మన రాష్ట్రంలో పట్టణాల్లో 23.85 గంటలు, గ్రామాల్లో 23.49 గంటల పాటు సరఫరా అందిస్తున్నారు. జాతీయ సగటు అంతరాయ సూచికతో పోల్చితే మన డిస్కంలలో సగానికంటే తక్కువగా ఫీడర్ అంతరాయాలు నమోదవుతున్నాయి. సేవలకు దక్కిన గుర్తింపు ఏడాదిలో ఈ జాతీయ సగటు అంతరాయ సూచిక 200.15 కాగా, ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఎస్పీడీసీఎల్)లో 42, ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్)లో 79.68, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీసీపీడీసీఎల్)లో 103.86 చొప్పున పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఫీడర్కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీ) వైఫల్యం రేటు 2.01 శాతం మాత్రమే ఉంది. దీని జాతీయ సగటు 5.81 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంతే కాకుండా 2017–18లో డిస్కంల పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉంటే అవి 2022–23లో 5.31 శాతానికి తగ్గాయి. కొత్త సర్వీసులకు వంద శాతం మీటరింగ్ పూర్తి చేయడంతో పాటు రిపేర్ వచ్చిన వాటి స్థానంలో త్వరితగతిన కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మాన్యువల్ జోక్యం లేకుండా ఇన్ఫ్రారెడ్(ఐఆర్) పోర్ట్ ద్వారా విద్యుత్ బిల్లులు రీడింగ్ తీస్తున్నారు. అలాగే వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు బిల్లింగ్ హెచ్చరికలు పంపిస్తూ ఆలస్య చెల్లింపుల జరిమానాలు పడకుండా వారిని అప్రమత్తం చేయడం వంటి చర్యలను కేంద్రం తన అధ్యయనంలో పరిగణనలోకి తీసుకుంది. ఆపరేషన్, విశ్వసనీయత, రెవెన్యూ కనెక్షన్లలో చేసిన కృషి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి తీసుకున్న చర్యలు, మీటరింగ్, బిల్లింగ్, తప్పులను సరిదిద్దడం, ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఈ క్రమంలో సాధించిన విజయాల ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏపీ డిస్కంలకు టాప్ టెన్లో స్థానం కల్పించింది. -
అప్పుల ఊబిలో విద్యుత్ రంగం
మణుగూరు రూరల్: విద్యుత్ సెక్టార్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టివే సిందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్ కొనుగోలుకు రూ.30,406 కోట్లు, బకాయిల పేరుతో రూ.59,580 కోట్లు అప్పు చేసి లెక్కలు లేకుండా తారుమారు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను శనివారం భట్టి సందర్శించారు. జెన్కో అధికారులతో కలిసి వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి వివరాల గురించి అడిగి తెలుసుకు న్నారు. అనంతరం సీఈ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. బీటీపీఎస్తో వచ్చే సమస్యలు అధిగమించేందుకు.. ప్రస్తుతం బీటీపీఎస్తో అనేక సమస్యలు తలె త్తుతున్న క్రమంలో వాటిని అధిగమించేందుకు భవిష్యత్లో ఉన్నత మైన ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. బీటీపీ ఎస్లో సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉండగా.. సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగిస్తున్నా రని, దీంతో పర్యావర ణానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్య లను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. జమలాపురం ఆలయాన్ని, మామునూరు పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, రేమిడిచర్లలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మిస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జెన్కో సీఎండీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి కృష్ణభాస్కర్, పినపాక, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్ పాల్గొన్నారు.
Related News by category
-
నాలుగోరోజు నామినేషన్ల జోరు
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కడప లోక్సభ స్థానానికి ఆరు నామినేషన్లు రాగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కడప లోక్సభ: కడప లోక్భ స్థానానికి కుంచెం వెంకట సుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఒకటి, ఇండిపెండెంట్గా ఒక నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల తరఫున మూడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వేణుగోపాల్ ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖాజా హుసేన్ ఒకటి, ఇండిపెంట్ అభ్యర్థిగా వెంకట సుబ్బారెడ్డి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలకు... బద్వేలు: కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్డీ విజయజ్యోతి ఒక సెట్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా దాసరి సుధ ఒక సెట్, సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా వెంకట సుబ్బరాయుడు ఒకటి, బీజేపీ అభ్యర్థిగా రోశన్న ఒకటి, బీజేపీ అభ్యర్థిగా అరుణరాజి ఒకటి, ఇండిపెండెంట్గా మల్లికార్జున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కడప: రీఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా సుబ్రమణ్యం ఒకటి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా అలీషేర్ ఒకటి, నేషనల్ మహా సభ అభ్యర్థిగా పట్టుపోగుల పవన్కుమార్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా అవ్వారు మల్లికార్జున నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఒకటి, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా దాసరి రవిశంకర్ ఒకటి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గవిరెడ్డి రామేశ్వర్రెడ్డి ఒకటి, బహుజన సమాజ్ పార్టీ తరఫున బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. కమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.రవీంద్రనాథ్రెడ్డి రెండు సెట్లు, ఇండిపెండెంట్గా నర్రెడ్డి కిశోర్రెడ్డి ఒకటి, సీపీఐ తరఫున గాలి చంద్ర ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాముల బ్రహ్మానందరెడ్డి ఒకటి దాఖలు చేశారు. జమ్మలమడుగు: ఇండిపెండెంట్గా రామేశ్వర్రెడ్డి ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మూలె సుధీర్రెడ్డి రెండు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రాంతి ప్రియ ఒకటి, ఇండిపెండెంట్గా ప్రమోద్కుమార్రెడ్డి ఒకటి, ఇండిపెండెంట్గా రామాంజనమ్మ ఒకటి, ఇండిపెండెంట్గా వెంకట సుబ్బారెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివస్రాద్రెడ్డి ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా సుబ్బరాయుడు ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా సురేష్బాబు ఒక నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు: తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టా సుధాకర్ ఒకటి, పుట్టా రవికుమార్ యాదవ్ ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డి ఒకటి, బీఎస్పీ తరఫున డీఎస్ జయరాం ఒకటి, ఇండిపెండెంట్గా ఆవుల వెంకట రమణ ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా డీఎస్ కల్యాణ్ ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా గుండ్లకుంట శ్రీరాములు ఒకటి, జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా లెక్కల శ్రీనివాసులురెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 44 నామినేషన్లు దాఖలు -
No Headline
ఒంటిమిట్ట: లోక కళ్యాణార్థం జగమేలే వైకుంఠరాముని జగత్ కళ్యాణం ఆంధ్రభద్రాద్రి ఏకశిలానగరి ఒంటిమిట్టలోని జగదభిరాముడి దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయమాడిన వేళ శిల్పకళాశోభితమైన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని మూల మూర్తులకు రాష్ట్ర స్పెషల్ సీఎస్ కరికలవల్లన్ కల్యాణ వేదిక వద్ద ఉన్న కల్యాణ దంపతులైన సీతారాములకు ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలు సంప్రదాయం ప్రకారం స్వామి వారికి సమర్పించారు. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచ్రందులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు తీర్చి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య భక్తుల జయజయ ధ్వనాలతో శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం వద్దకు తీసుకు వచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్షేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. ముంజానకీ ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేద పండితులు స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో పెట్టి కన్యావరణ జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోప వీత ధారణం చేశారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదకస్నానం నిర్వహించి, వర పూజ చేశారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా నును సిగ్గుల మొలకై న సీతమ్మ నోసటన కళ్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సీఎస్ కరికాలవలవన్ సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నాడు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కణ్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళకాష్టం చదివారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పఠనం భక్తుల రామనామ ధ్వనుల మధ్య హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతి దేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానించి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపినీ సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రాధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కళ్యాణమూర్తుల శిరస్సుపై వేసి కనుల పండువగా కళ్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ● స్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్తోపాటు టీటీడీ యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు, లక్షలాది మంది భక్త జనం వీక్షించారు. భక్తుల రామనామ సంకీర్తనలు.. పండితుల చతుర్వేద పఠనం..మంగళవాయిద్యాల నడుమ.. సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో దశరథ మహారాజు తనయుడు శ్రీ రామచంద్రమూర్తి , జనకుని గారాల పట్టి.. నునుసిగ్గుల మొలక సీతమ్మను పరిణయమాడాడు. కమనీయం..రమణీయమైన ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో తడిసిముద్దయ్యారు. కమనీయం..దాశరథి కల్యాణం ఏకశిలానగరిలో పండు వెన్నెలలో రాములోరి కల్యాణం కనులారా వీక్షించిన చంద్రుడు పోటెత్తిన భక్తజనం మార్మోగిన రామనామం -
●గజేంద్రుడిపై జగదభిరాముడు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తర్వాత స్వామివారు గజవాహనంపై విహరించారు.అంతకు ముందు ఉదయం 7 నుంచి 9గంటల వరకు శివధనుర్భంగాలంకారంలో రాములోరు భక్తులకు దర్శనం ఇచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రథారోహణం, 10:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రథోత్సవం నిర్వహిస్తారు. -
టెన్త్లో తీన్మార్
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా మెరిసింది. గతంతో పోల్చితే ఓ స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉత్తీర్ణతశాతం కూడా మెరుగైంది. గతేడాది 79.43 శాతం ఉండగా ఈ ఏడాది 92.10 శాతం పెరిగింది. అంటే గతేడాది కంటే ఈఏడాది 12.67 శాతం పెరగడం విశేషం. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా విద్యాశాఖ అధికారులు చాలా పకడ్బందీగా పది పరీక్షలను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పది పరీక్షలకు 27729 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాయగా ఇందులో 25538 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ప్రభుత్వ మ్యానేజ్మెంట్కు సంబంధించి ఏపీ మోడల్ స్కూల్స్ 99.61 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటిస్థానంలో నిలువగా బీసీ వెల్పేర్ 99.05 స్థానం సాధించి ద్వితీయస్థానంలో, ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ 98.72 శాతం ఉత్తీర్ణత సాధించి తృతీయస్థానంలో నిలిచాయి. ప్రభుత్వ చొరవతోనే.. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలకు నాడు –నేడు కింద సకలసౌకర్యాలను సమకూర్చింది. విద్యార్థుల చదువు కోసం అవసరమైన అన్ని రకాల వస్తువులను విద్యాకానుక పేరిట సకాలంలో అందించింది. దీంతోపాటు పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అలాగే అమ్మ ఒడిని అందించింది. దీంతో పిల్లలు ఏ చీకూచింత లేకుండా చదువుకున్నారు. పది ఫలితాలను అదరగొట్టారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమకూరిన వసతుల కారణంగా ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలికలదే హవా.. ఈ సారి ఫలితాల్లోనూ బాలురపై బాలికలే పై చేయి సాధించారు. జిల్లావ్యాప్తంగా 14214 మంది బాలురు, 13515 మంది బాలికలు పరీక్ష రాశారు. వీరిలో బాలురు 12929 మంది పాసై 90.96 శాతం ఉత్తీర్ణతను సాధించగా.. బాలికలు 12609 మంది పాసై 93.3 శాతం ఉత్తీర్ణతను సాధించారు. 22255 మందికి ప్రథమస్థానం: పది పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 27729 మంది విద్యార్థులు పరీక్షను రాయగా ఇందులో 25,538 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 22255 మంది విద్యార్థులు ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించగా 2378 ద్వితీయస్థానంలో ఉత్తీర్ణతను సాధించారు. అలాగే మరో 905 మంది తృతీయస్థానంలో నిలిచారు. సంవత్సరం పరీక్షలు రాసిన పాసైన పాస్ రాష్ట్రంలో విద్యార్థులు వారు శాతం స్థానం 92.10 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3వ స్థానం గతేడాది కంటే ఒక స్థానం ముందుకు జిల్లావ్యాప్తంగా 27729 మందికిగాను 25538 మంది పాస్ గతేడాదికంటే 12.67 శాతం పెరిగిన ఉత్తీర్ణత వందశాతం ఉత్తీర్ణత సాధించిన 200 ప్రభుత్వ పాఠశాలలు 2017–18 35660 34008 95.37 10 2018–19 36536 33943 92.90 11 2019–20 37,600 37600 100 – 2020–21 37955 37,955 100 – 2021–22 38035 27018 71.03 06 2022–23 27097 21524 79.43 04 2023–24 27729 25538 92.10 03 -
No Headline
ఎయిడెడ్ 768 650 84.64 బీసీవెల్పేర్ 210 208 99.05 ప్రభుత్వ 707 590 83.45 కేజీబీవీ 613 593 96.74 మున్సిపాలిటీ 1776 1425 80.24 మోడల్స్కూల్స్ 254 253 99.61 ఏపీ రెసిడెన్షియల్ 156 154 98.72 సోసియల్ వెల్ఫేర్ 839 816 97.26 ట్రైబల్ వెల్ఫేర్ 99 93 93.94 జెడ్పీ 9389 8147 86.77 ప్రైవేటు 12918 12609 97.61
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement