9999@ రూ.3.70లక్షలు | Sakshi
Sakshi News home page

9999@ రూ.3.70లక్షలు

Published Fri, May 13 2016 9:13 AM

9999@ రూ.3.70లక్షలు

విజయవాడ : రవాణేతర వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల మోజు కొనసాగుతోంది. గురువారం రవాణాశాఖ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో పద్మజ లేబరేటరీ కంపెనీ నిర్వాహకులు ఏపీ16 డీఎల్ 9999 నంబరును రూ.3,70,100కు దక్కించుకున్నారు. ఈ నంబరు కోసం నాలుగు దరఖాస్తులు రాగా, ఇందులో అత్యధిక బిడ్‌ను రూ.3,20,100ను పద్మజ లేబరేటరీ నిర్వాహకులు కోట్ చేశారు. మిగిలిన వారి కంటే వీరు అధిక మొత్తం కోట్ చేయడంతో రూ.50వేల రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి రూ.3,70,100కు వీరికి ఈ నంబరు కేటాయించినట్టు ఇన్‌చార్జి ఉప రవాణా కమిషనర్ ఎం.పురేంద్ర తెలిపారు.
 
గత ఫిబ్రవరిలో ఏపీ 16 డీహెచ్ సిరీస్ నంబర్‌ను రూ.6,03,000 కోట్ చేసిన వారికి కేటాయించారు. ఏపీ 16 డీఎల్ సిరీస్ ముగియడంతో గురువారం నుంచి ఏపీ 16 డీఎం సిరీస్ ప్రారంభమైందని పురేంద్ర తెలిపారు. ఈ సిరీస్‌లోని నంబర్ల కోసం 91మంది దరఖాస్తు చేయగా, ఒకే నంబరుకు 11మంది పోటీ పడినట్టు చెప్పారు. దీనికి రిజర్వేషన్ ఫీజు రూపంలో రూ.3,60,000, బిడ్ మొత్తంగా రూ.6,16,727 ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎస్.వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి ఏవో కె.భాగ్యరేఖ, ఎం.రాజుబాబు, ఎన్.విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement