బీరుపై రూ.15 పెంచి అమ్మకాలు
మద్యం ప్రియుల జేబులకు చిల్లులు
నెలకు రూ.4.82 కోట్లకు పైగా దోపిడీ
చిత్తూరు: రోహిణి కార్తె రాకముందే ఎండలు రోళ్లు పగిలేలా కాస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటుతోంది. ఈ తరుణంలో మందుబాబులు చల్లని కిక్కు కోసం బీర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని మద్యం వ్యాపారులు సిండికేట్ అయి రేట్లు పెంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
కూలింగ్ పేరుతో..
జిల్లాలో 382 మద్యం షాపులు, 26 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు ఎక్సైజ్ డివిజన్లుగా విభజించారు. ఈ డివిజన్ల నుంచే ఆ పరిధిలోని దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఈ రెండు డివిజన్ల పరిధిలో ఏప్రిల్లో సుమారు 2 లక్షల 68 వేల బీరు కేసులను అమ్మారు. ఒక్కో బీరు కేసులో 12 బీర్లు ఉంటాయి. ఒక్కో బీరుపై సుమారు రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కూలింగ్ కోసం పెంచామని సమాధానమిస్తున్నారు. ఇలా వసూలు చేయడం వల్ల జల్లా వ్యాప్తంగా రూ.4.82 కోట్లు మద్యం బాబులపై అదనపు భారం పడుతోంది.
నిబంధనలు గాలికి..
మద్యం షాపుల దగ్గర ఇచ్చే పర్మిట్ రూములకు కేవలం మందు తాగడానికే అనుమతి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇవి అన్ని చోట్లా దాబాలుగా మారిపోయాయి. మాంసం, ఇతర ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో బీర్లు, మద్యంపై రూ.10 నుంచి రూ.15 అదనంగా వసూలు చేస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ దందా గురించి ఎక్సైజ్ పోలీసులకు తెలిసినా నెలనెలా మామూళ్లు అందుతుండటంతోపట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కఠిన చర్యలు..
మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశాం. మద్యం అధిక ధరలకు విక్రయించకుండా ఆన్లైన్ బిల్లింగ్ పద్ధతిని త్వరలో ప్రవేశపెడుతున్నాం.
- సత్యప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్,
ఎక్సైజ్ శాఖ, చిత్తూరు.
‘చల్లచల్లగా’ దోచేస్తున్నారు
Published Wed, May 4 2016 4:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement