⇒ విజృంభిస్తున్న దొంగలు
⇒ హత్యలకు తెగబడుతున్న వైనం
⇒ మొక్కుబడిగా పోలీసు గస్తీ
దొంగలు పెట్రేగిపోతున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళితే చాలు.. తిరిగొచ్చేలోగా కొల్లగొట్టేస్తున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే అదను చూసి పుస్తెల గొలుసులు తెంపు కెళుతున్నారు. బంగారు ఆభరణాల కోసం హత్యలకూ వెనుకాడటం లేదు. వాహనాల్లో పెట్రోలు మొదలు.. ఇంట్లోని బంగారు, ఇతర విలువైన వస్తువులను సైతం దోచేస్తున్నారు. పోలీసుల నిఘా వైఫల్యం. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపం దొంగలకు కలిసి వస్తోంది. వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
నెల్లూరు (క్రైమ్) : నెల్లూరు నగరంతో జిల్లాలో దొంగలు విజృంభిస్తున్నారు. జనం క్షణక్షణం అభద్రతా భావంతో గడిపే దుస్థితి నెలకొంది. ఇల్లు వదిలి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొందరు దేవుడిపై భారం వేసి దేవుడా నీవే దిక్కంటూ గడప దాటుతున్నారు. తాళం వేసి ఉంటే చాలు దుండగులు మాటేసి ఇల్లు లూటీ చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దుండగులు దోచుకెళ్లిపోతున్నారు. వీధుల్లో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలను గుర్తించి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. మరికొన్ని చోట్ల దుండగులు పోలీసులమని భద్రత పేరుతో మహిళలు, వృద్ధులను అప్రమత్తం చేసి నగలు కాజేస్తున్నారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి వారిని హత్య చేసి అందిన కాడికి దోచుకెళుతున్నారు.
బైక్, ఆటో దొంగతనాలు సైతం అధికమయ్యాయి. ప్రస్తుతం దొంగతనాలే వృత్తిగా పెట్టుకున్న వారే కాకుండా జల్సాలకు అలవాటు పడిన యువకులు, విద్యార్థులు సైతం దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ కేసులో నిమగ్నమై ఉండగానే మరో చోట దొంగతనాలకు పాల్పడుతూ నేరగాళ్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ప్రతి వేసవిలో చోరీలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న దృష్ట్యా దొంగతనాలు మరిన్ని జరిగే అవకాశం ఉండటంతో ఏ క్షణంలో ఏంజరుగుతుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆర్భాటపు ప్రకటనలే
చోరీలపై సిబ్బందిని అప్రమత్తం చేసి, గస్తీ ముమ్మరం చేశామని పోలీసులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. పోలీసుల తీరు చూస్తే నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఏదైనా నేరం జరిగితే ఉన్నతాధికారుల మందలింపులు తప్పవన్న భయంతో నేరం జరిగిన వెంటనే హడావుడి చేస్తున్నారే తప్ప నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం, దొంగలను పట్టుకోలేక పోతున్నారు. దొంగతనాల నియంత్రణకు ప్రతి స్టేషన్లో క్రైం పార్టీ సిబ్బంది ఉన్నారు. అధికారులు వీరిని స్వప్రయోజనాలకు వాడుకోవడంతో నేర నియంత్రణపై శ్రద్ధ కొరవడుతుంది. గస్తీ విధులు నిర్వహించే సిబ్బందికి దొంగల పట్ల సరైన అవగాహన లేకపోవడం, మొక్కుబడి విధులకే పరిమితమవుతున్నారు. నేర నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీఎస్ వ్యవస్థ నామమాత్రపు చర్యలకే పరిమితమైందన్న విమర్శలు మూటగట్టుకుంటుంది.
ఇటీవల సంఘటనలు
► జనవరి 5న ఉస్మాన్సాహెబ్పేటో విశ్రాంత ఆరే ్జడీ సీతారామన్ను హత్యచేసి 15 సవర్లు దోచుకెళ్లారు.
► గతనెల 19న నర్తకిసెంటర్లో సూర్యతేజకు చెందిన అప్పీ ఆటో చోరీకి గురైంది.
► గత నెల 20న ఎన్టీఆర్నగర్లో వాసు ఇంట్లో దొంగలు పడి రూ.1.10 లక్షలు బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు.
► గత నెల 27న పడారుపల్లి జాషువానగర్లో ప్రసాద్ ఇంట్లో దొంగలు పడి రూ. లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగలించారు.
► ఫిబ్రవరి 6న బాలాజీనగర్ పినాకిని అవెన్యూలో కె. గీతా కామాక్షికి చెందిన కార్యాలయంలో దొంగలు పడి రూ.50 వేలు విలువైన కంప్యూటర్లు ఇతర పరికరాలు దొంగలించారు.
► ఫిబ్రవరి 8న మూలాపేట కొండదిబ్బలో శ్రీనివాసులు ఇంట్లో దొంగలు పడి రూ.72 వేలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచేశారు.
► ఈ నెల 13న ముత్యాలపాళెంలో కిరణ్కుమార్ ఇంట్లో దొంగలు పడి రూ.5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలించారు.
► ఈ నెల 13న చంద్రమౌళీనగర్లో జాన్శామ్యూల్ ఇంట్లో దొంగలు పడి రూ.75 వేలు విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు.
► ఈ నెల 14వ తేదీన తల్పగిరికాలనీలో త్రివిక్రమ్నాయుడు ఇంట్లో దొంగలు పడి రూ.6.50 లక్షల సొత్తు అపహరించుకుని వెళ్లారు.
► ఈ నెల 15న ఆదిత్యానగర్లో జనార్దన్రెడ్డి ఇంట్లో రూ.లక్ష సొత్తును దొంగలించారు.
► తాజాగా ఆదివారం వనంతోపు సెంటర్లో వెంకటేశ్వర్లు ఇంట్లో దొంగలు పడి 3 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలించారు.
గస్తీ ముమ్మరం
దొంగతనాలను నియంత్రించేందుకు పగటి, రాత్రి గస్తీలు నిర్వహిస్తున్నాం. దీంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నంబరుకు లేదా సమీపంలోని పోలీస్స్టేషన్లకు ఫిర్యాదు చేయండి.
– నగర డీఎస్పీ జి. వెంకటరాముడు
మాటేసి..దోచేసి
Published Mon, Feb 27 2017 11:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement