ఖమ్మం జిల్లాలో బకెట్ బాంబులు | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో బకెట్ బాంబులు

Published Sun, Jul 24 2016 7:13 PM

Bucket bombs in Khammam district

వెంకటాపురం మండలం మొర్రువానిగూడెం ర్యాంపు సమీపంలో బకెట్ బాంబు వెలుగుచూసింది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో 40 మందికిపైగా సాయుధులైన మావోలు సానుభూతిపరులైన గొత్తికోయలతో కలిసి ఈ బాంబులను అమర్చినట్లు తెలిసింది.  రాత్రి సమయంలో భద్రాచలం డిపో నుంచి వెంకటాపురం వచ్చే బస్సును, వరంగల్ డిపో నుంచి భద్రాచలం వెళ్లే బస్సులను ఆపి ప్రయాణికులను సెల్‌ఫోన్ల స్విచాప్ చేసుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. బకెట్ బాంబులు పెట్టి రోడ్డుకు అడ్డంగా రోప్‌లు కట్టి వారోత్సవాలను విజయవంతం చేయాలని కరపత్రాలు వేసి బస్సులను వెనక్కు పంపినట్లు సమాచారం.

 

Advertisement
Advertisement