ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై వేధింపుల కేసు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై వేధింపుల కేసు

Published Mon, Aug 29 2016 11:17 PM

Case on govenament teacher

కమలాపూర్‌: మండలంలోని భీంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బండ శ్రీనివాస్‌పై వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సోమవారం నమోదు చేసినట్లు ఎస్సై ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. శ్రీనివాస్‌ భీంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం జాన్సీలక్ష్మితో అసభ్య పదజాలంతో మాట్లాడుతూ లైంగిక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.
 
 

Advertisement
Advertisement