అహోబిలేసుని సన్నిధిలో కేంద్ర మంత్రి | Sakshi
Sakshi News home page

అహోబిలేసుని సన్నిధిలో కేంద్ర మంత్రి

Published Thu, Jun 1 2017 12:10 AM

అహోబిలేసుని సన్నిధిలో కేంద్ర మంత్రి

ఆళ్లగడ్డ:  అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర రసాయనిక ఎరువుల శాఖ మంత్రి ఆనంద్‌బాబు బుధవారం దర్శించుకున్నారు.   హెలికాప్టర్‌లో కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు దిగువ అహోబిలంలో ఆలయ ప్రతినిధులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు.  దిగువన  శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు   ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయప్రతినిధులు తీర్థ ప్రసాదాలు, స్వామి వారి జ్ఞాపికను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఎగువ అహోబిలం చేరుకుని శ్రీ జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. తరా​‍్వత కేంద్రమంత్రి బెంగళూరు బయలు దేరి వెళ్లారు. 
 

Advertisement
Advertisement