కాపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సర్టిఫికెట్ల పరిశీలన | Sakshi
Sakshi News home page

కాపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సర్టిఫికెట్ల పరిశీలన

Published Tue, Nov 1 2016 6:43 PM

certificates verification

ఏలూరు (మెట్రో)
జిల్లాలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 54 గ్రూపులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 గ్రూపులకు  సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు ధృవీకరించారు.  పరిశీలన పూర్తి చేసుకున్న గ్రూపుల అభ్యర్థులకు త్వరలో  ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కార్పొరేషన్‌ ఈడీ ఎన్‌. పుష్పలత తెలిపారు.  ఎంపికైన గ్రూపులకు పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు  రూ. 10 లక్షల బ్యాంకు రుణం, రూ. 10 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ అందించనున్నట్లు ఆమె చెప్పారు. 
 
 

Advertisement
Advertisement