• నానమ్మ ఇంటికెళ్లొస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు
• గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఆగిన బాలుడి ఊపిరి
• మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదన
చోటు... చోటు.. (చిన్న.. చిన్న) అంటూ పలకరిస్తే అందరి దగ్గరకూ వెళుతుంటివే. అలాంటి వాణ్ణి చంపేందుకు వారికి చేతులెలా వచ్చాయి.. ఆ పసికందు ఏం పాపం చేశాడని పొట్టనపెట్టుకున్నారు.. అంటూ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అభం, శుభం తెలియని పసికందును మానవరూపంలో ఉన్న మృగాలు చంపేశాయి. ఈ విషాద సంఘటన మండలకేంద్రమైన కణేకల్లులో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు... మత్స్య కార్మికుల కాలనీలో నివాసముంటున్న తాపీ మేస్త్రీ సద్దాంహుసేన్, బాను దంపతులు. వీరికి దాదాఖలందర్ (3), ఇమాంబు (1) సంతానం. శనివారం రాత్రి 7 గంటల సమయంలో దాదాఖలందర్కు ఆకలేయడంతో తల్లి అన్నం తినిపించింది.
ఆ తర్వాత పక్కనే ఉంటున్న నాయనమ్మ ఇంటికి వెళ్లొస్తానని చెప్పి దాదాఖలందర్ బయటికొచ్చాడు. సరే వెళ్లి తొందరగా రమ్మని చెప్పి పంపింది తల్లి. ఎంతసేపటికీ కొడుకు ఇంటికి రాకపోవడంతో అత్తింటికెళ్లి కొడుకు గురించి అడగడంతో ఇక్కడకు రాలేదని అత్తమామలు చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని భర్త, ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో అందరూ కలసి పసికందును వెతకడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ యువరాజు, పోలీసు సిబ్బంది కూడా పరిసర ప్రాంతాల్లో గాలించారు. రాత్రి 11గంటల వరకు గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. అంతా వెళ్లిపోయిన తర్వాత కాలనీ ముందు భాగంలో చేపల పాండ్ ( చేపల పెంపకం కోసం ఏర్పాటు చేసిన కుంట) వద్ద బాలుని శవం లభించింది. తామంటే గిట్టనివారే ఈ అఘాయిత్యం చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.
పథకం ప్రకారమే హత్య..!
కణేకల్లు–కణేకల్లు క్రాసింగ్ మార్గమధ్యంలో కుడివైపున మత్స్య కార్మికుల కాలనీ ఉంది. చేపల పెంపకం కుంట ఎడమవైపు ఉంది. రెండింటికీ మధ్య ప్రధాన రహదారి ఉంది. మూడేళ్ల చిన్నారి కాలనీ నుంచి రోడ్డు దాటి అక్కడ నుంచి 120 అడుగుల దూరంలో ఉన్న కుంట వద్దకు వెళ్లలేడు. నాయనమ్మ ఇంటికి వెళ్లొస్తానని బయటికొచ్చిన సమయంలోనే ఎవరో పథకం ప్రకారం దాదాఖలందర్ను చేరదీసి.. ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసులు, బంధువులు వెతకడం పూర్తయ్యాక అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి చేపల కుంట వద్ద విగతజీవుడైన బాలుడిని పడుకోబెట్టి వచ్చేశారు. ఒక వేళ చిన్నారే నడుచుకొంటూ వెళ్లినట్లైతే ఏటవాలుగా ఉన్న ఆ ప్రదేశంలో కాలుజారి గోతిలో పడిపోవాలి. అలా కాకుండా దిగువన నీటిగట్టపై నిద్రిస్తున్నట్టుగా ఉండటం బట్టి చూస్తే ఎవరో చంపేశారని స్పష్టమవుతోంది.
పాపాత్ములను అల్లానే శిక్షిస్తాడు..
పసిపిల్లలు దేవునితో సమానం. బాలుడిని చంపిన పాపాత్ములను ఆ అల్లానే శిక్షిస్తాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించడం ఇష్టం లేక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు.
పసికందును చంపేశారు!
Published Sun, Sep 4 2016 11:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
What’s your opinion
Advertisement