-
ఆంధ్ర అండర్–25 జట్టుకు దాదా ఖలందర్
అనంతపురం సప్తగిరిసర్కిల్ : ఆంధ్ర అండర్–25 అంతర్రాష్ట్ర క్రికెట్ జట్టుకు జిల్లాకు చెందిన ఫాస్ట్బౌలర్ దాదా ఖలందర్ ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. విజయనగరంలో జరిగిన ప్రాబబుల్స్ ఎంపికలో అద్భుత ప్రతిభ కనబరచినందుకు రాష్ట్ర జట్టులో చోటు దక్కిందని పేర్కొన్నారు. గతంలో జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపిక కాగా, వారిలో దాదా ఖలందర్ను స్టాండ్ బైగా ఉన్నాడని వివరించారు. తర్వాత ఆంధ్ర జట్టు రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత జిల్లా క్రీడాకారుడికి స్థానం దక్కిందన్నారు. ఈ సందర్భంగా దాదా ఖలందర్ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంఛో ఫెర్రర్, బీఆర్ ప్రసన్న అభినందించారు. -
పసికందును చంపేశారు!
• నానమ్మ ఇంటికెళ్లొస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు • గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఆగిన బాలుడి ఊపిరి • మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదన చోటు... చోటు.. (చిన్న.. చిన్న) అంటూ పలకరిస్తే అందరి దగ్గరకూ వెళుతుంటివే. అలాంటి వాణ్ణి చంపేందుకు వారికి చేతులెలా వచ్చాయి.. ఆ పసికందు ఏం పాపం చేశాడని పొట్టనపెట్టుకున్నారు.. అంటూ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతలు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభం, శుభం తెలియని పసికందును మానవరూపంలో ఉన్న మృగాలు చంపేశాయి. ఈ విషాద సంఘటన మండలకేంద్రమైన కణేకల్లులో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు... మత్స్య కార్మికుల కాలనీలో నివాసముంటున్న తాపీ మేస్త్రీ సద్దాంహుసేన్, బాను దంపతులు. వీరికి దాదాఖలందర్ (3), ఇమాంబు (1) సంతానం. శనివారం రాత్రి 7 గంటల సమయంలో దాదాఖలందర్కు ఆకలేయడంతో తల్లి అన్నం తినిపించింది. ఆ తర్వాత పక్కనే ఉంటున్న నాయనమ్మ ఇంటికి వెళ్లొస్తానని చెప్పి దాదాఖలందర్ బయటికొచ్చాడు. సరే వెళ్లి తొందరగా రమ్మని చెప్పి పంపింది తల్లి. ఎంతసేపటికీ కొడుకు ఇంటికి రాకపోవడంతో అత్తింటికెళ్లి కొడుకు గురించి అడగడంతో ఇక్కడకు రాలేదని అత్తమామలు చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని భర్త, ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో అందరూ కలసి పసికందును వెతకడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ యువరాజు, పోలీసు సిబ్బంది కూడా పరిసర ప్రాంతాల్లో గాలించారు. రాత్రి 11గంటల వరకు గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. అంతా వెళ్లిపోయిన తర్వాత కాలనీ ముందు భాగంలో చేపల పాండ్ ( చేపల పెంపకం కోసం ఏర్పాటు చేసిన కుంట) వద్ద బాలుని శవం లభించింది. తామంటే గిట్టనివారే ఈ అఘాయిత్యం చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారమే హత్య..! కణేకల్లు–కణేకల్లు క్రాసింగ్ మార్గమధ్యంలో కుడివైపున మత్స్య కార్మికుల కాలనీ ఉంది. చేపల పెంపకం కుంట ఎడమవైపు ఉంది. రెండింటికీ మధ్య ప్రధాన రహదారి ఉంది. మూడేళ్ల చిన్నారి కాలనీ నుంచి రోడ్డు దాటి అక్కడ నుంచి 120 అడుగుల దూరంలో ఉన్న కుంట వద్దకు వెళ్లలేడు. నాయనమ్మ ఇంటికి వెళ్లొస్తానని బయటికొచ్చిన సమయంలోనే ఎవరో పథకం ప్రకారం దాదాఖలందర్ను చేరదీసి.. ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసులు, బంధువులు వెతకడం పూర్తయ్యాక అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి చేపల కుంట వద్ద విగతజీవుడైన బాలుడిని పడుకోబెట్టి వచ్చేశారు. ఒక వేళ చిన్నారే నడుచుకొంటూ వెళ్లినట్లైతే ఏటవాలుగా ఉన్న ఆ ప్రదేశంలో కాలుజారి గోతిలో పడిపోవాలి. అలా కాకుండా దిగువన నీటిగట్టపై నిద్రిస్తున్నట్టుగా ఉండటం బట్టి చూస్తే ఎవరో చంపేశారని స్పష్టమవుతోంది. పాపాత్ములను అల్లానే శిక్షిస్తాడు.. పసిపిల్లలు దేవునితో సమానం. బాలుడిని చంపిన పాపాత్ములను ఆ అల్లానే శిక్షిస్తాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించడం ఇష్టం లేక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement