దంపతుల ఆత్మహత్యా యత్నం | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్యా యత్నం

Published Sun, Jul 24 2016 6:03 PM

dampathula aathmahathyayatnam

దంపతుల ఆత్మహత్యా యత్నం
మదనపల్లె : కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు... వాల్మీకిపురం మండలం జర్రాపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులు(30), శకుంతల(27)lదంపతులను అత్తమామలు మూడేళ్ల క్రితం ఆస్తిలో భాగం ఇవ్వకుండానే వేరు కాపురం పెట్టారు. ఈ తరణంలో శకుంతల పేరుతో ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేయడంతో ఇంటిని నిర్మించుకున్నారు. శకుంతల అత్త మామలు నరసింహులు, రమణమ్మకు నాలుగు రోజుల క్రితం ఆస్తి విషయమై గొడవ పడి కోడలిపై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన శకుంతల శనివారం విషం తాగింది. ఆమెను వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శకుంతలను విచారించి అత్తమామలతోపాటు శకుంతల భర్తపై కేసు నమోదుచేశారు. దీన్ని అవమానంగా భావించిన శ్రీనివాసులు ఆదివారం పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.
 

Advertisement
Advertisement