దంపతుల ఆత్మహత్యా యత్నం
మదనపల్లె : కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు... వాల్మీకిపురం మండలం జర్రాపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులు(30), శకుంతల(27)lదంపతులను అత్తమామలు మూడేళ్ల క్రితం ఆస్తిలో భాగం ఇవ్వకుండానే వేరు కాపురం పెట్టారు. ఈ తరణంలో శకుంతల పేరుతో ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేయడంతో ఇంటిని నిర్మించుకున్నారు. శకుంతల అత్త మామలు నరసింహులు, రమణమ్మకు నాలుగు రోజుల క్రితం ఆస్తి విషయమై గొడవ పడి కోడలిపై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన శకుంతల శనివారం విషం తాగింది. ఆమెను వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శకుంతలను విచారించి అత్తమామలతోపాటు శకుంతల భర్తపై కేసు నమోదుచేశారు. దీన్ని అవమానంగా భావించిన శ్రీనివాసులు ఆదివారం పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు.
దంపతుల ఆత్మహత్యా యత్నం
Published Sun, Jul 24 2016 6:03 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement