బిహార్లో మృత్యువాత
హైదరాబాద్: బిహార్ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహిస్తున్న టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ డెంగీ బారిన పడి మృతి చెందాడు. కానిస్టేబుల్ చిల్ల వాసు(పీసీ నం.497) మృతితో కొండాపూర్లోని టీఎస్ఎస్పీ 8వ బెటాలియన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడ, అవసరాల వీధికి చెందిన చిల్ల వాసు(36) యూసుఫ్గూడలోని మొదటి బెటాలియన్లో 2000 సంవత్సరంలో కానిస్టేబుల్గా చేరాడు. ప్రస్తుతం ఎనిమిదో బెటాలియన్కు చెందిన అతను బిహార్ ఎన్నికల బందోబస్తులో భాగంగా ఈ నెల 1న ఆ రాష్ట్రంలోని చాప్రా జిల్లాకు వెళ్లాడు. అక్కడ డెంగీ జ్వరం సోకడంతో జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు.
మృతదేహం తరలింపునకు చర్యలు
వాసు మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు టీఎస్ఎస్పీ ఐజీ శ్రీనివాసరావు, కమాండెంట్ సత్యనారాయణరావు ఏర్పాట్లు చేశారు. వాసు భార్య రమణమ్మ, కొడుకులు శశాంక్, కుశాల్తో పాటు మరో ఇద్దరి బంధువులను సాయంత్రం 6 గంటలకు విమానంలో బిహార్కు పంపారు. వారితో పాటు కమాండెంట్ సత్యనారాయణ, టీఎస్ఎస్పీ 8వ బెటాలియన్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కె.బాలకృష్ణమూర్తి కూడా వెళ్లారు. వాసు మృతదేహాన్ని మంగళవారం విమానంలో స్వస్థలానికి తరలిస్తామని కమాండెంట్ తెలిపారు.
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై వాసు మృతి చెందడం తమకు ఎంతో బాధ కల్గించిందని ఇన్చార్జి కమాండెంట్ సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం అతనితో ఫోన్లో మాట్లాడానని, కోలుకున్నాక వస్తానని చెప్పాడని ఇంతలోనే ఇలా జరగడం ఆవేదన కలిగించిందన్నారు. వాసు కుటుంబానికి న్యాయం చేస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆర్థికంగా కూడా అతని కుటుంబానికి వచ్చే పరిహారాలు త్వరగా వచ్చేలా చూస్తామన్నారు.
సరైన వైద్యం అందకే మృతి: భార్య రమణమ్మ
తన భర్త వాసుతో ఆదివారం రాత్రి 10 గంటలకు ఫోన్లో మాట్లాడినట్లు అతని భార్య రమణమ్మ తెలిపారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినడం తమను షాక్కు గురిచేసిందని ఆమె బోరున విలపించారు. 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా సెలవు మంజూరు చేయలేదనీ, సరైన వైద్యం కూడా అందని కారణంగానే తన భర్త మరణించాడని రమణమ్మ ఆరోపించారు.
డెంగీతో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ మృతి
Published Tue, Oct 27 2015 1:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement