తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Wed, Nov 2 2016 8:33 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ప్రస్తుతం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 81,981 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement