జిల్లాలో నయీం ప్రకంపనలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో నయీం ప్రకంపనలు

Published Sun, Aug 14 2016 11:30 PM

District nayim vibe

సాక్షి ప్రతినిధి, కడప: తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌లో హతమైన తర్వాత సిట్‌ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నయీం మూలాలు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల్లో సైతం ఉన్నాయనే ఉద్దేశంతో తెలంగాణ పోలీసులు జిల్లా కేంద్రమైన కడపలో తిష్ట వేసి ఉన్నారు. శనివారం రాత్రి కడపకు చేరుకున్న పోలీసులు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన పలువురు నయీం నేర సామ్రాజ్యంలో భాగస్వాములై అనేక అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి నయీం గ్యాంగ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు రావడంతో ఆ దిశగా తెలంగాణ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement