Sakshi News home page

కుర్చేసుకొని కూర్చుంటానన్నావ్...ఎక్కడ?

Published Sat, Jul 25 2015 8:20 AM

కుర్చేసుకొని కూర్చుంటానన్నావ్...ఎక్కడ? - Sakshi

నాగర్కర్నూల్: ఆర్డీఎస్ వద్ద కుర్చేసుకుని కూర్చొని ఆనకట్ట ఎత్తు పెంచుతానన్న సీఎం కేసీఆర్ పత్తా లేకుండా పోయారని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పెండింగ్ ప్రాజెక్టుల యాత్రను శుక్రవారం ఆమె నాగర్కర్నూలులో ప్రారంభించి పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా డీకె అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్డీఎస్ విషయంలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. పాలమూరు ప్రజలను మామా అల్లుళ్లు మభ్యపెట్టాలని చూస్తే డొక్క చించుతారని హెచ్చరించారు.

 

Advertisement

What’s your opinion

Advertisement