సూపర్ లగ్జరీ బస్సు బోల్తా: డ్రైవర్ మృతి | Sakshi
Sakshi News home page

సూపర్ లగ్జరీ బస్సు బోల్తా: డ్రైవర్ మృతి

Published Thu, Nov 3 2016 12:24 PM

driver died in super luxury bus slipped incident

సదాశివనగర్: వేగంగా వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న సూపర్‌ లగ్జరీ బస్సు దగ్గి వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఆ వెంటనే పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి(40) అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
Advertisement