-
సూపర్ లగ్జరీ బస్సు బోల్తా: డ్రైవర్ మృతి
సదాశివనగర్: వేగంగా వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు దగ్గి వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆ వెంటనే పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి(40) అక్కడికక్కడే మృతిచెందాడు. -
కాలేజీ బస్సు బోల్తా... 26 మందికి గాయాలు
దువ్వూరు: ఓ ప్రైవేట్ కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట సమీపంలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన రాయలసీమ వ్యాయామ కళాశాల విద్యార్థులు మూడు బస్సుల్లో విహార యాత్రలో భాగంగా అహోబిలం వెళుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట వద్ద గొర్రెల మందను తప్పించే క్రమంలో ఇందులోని ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 26 మంది విద్యార్థులకు గాయాలు కాగా వీరికి చికిత్స అందించేందుకు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. -
బస్సు బోల్తా: పది మందికి గాయాలు
కోడుమూరు(కర్నూలు): కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి సమీపంలో బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు. డోన్ డిపో ఆర్టీసీ బస్సు బుధవారం సాయంత్రం సుమారు 40 మంది ప్రయాణికులతో కోడుమూరు నుంచి లద్దగిరి వైపు వెళుతోంది. వెంకటగిరి సమీపంలో ఆటోను తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో బస్సు రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కోడుమూరు ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి బస్సు బోల్తా, 15 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ లోని హోషాంగాబాద్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు హోషాంగాబాద్ సమీపంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతిచెందగా, మరికొంత మందికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా: 30 మందికి గాయాలు
శ్రీకాకుళం(కంచిలి): శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది గాయపడగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కంచిలి మండలంలోని కొత్తఅంపురం చెరువు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పలాస డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు సోంపేట నుంచి కంచిలి మీదగా గంగాధరపురం వెళుతుండగా కొత్తఅంపుర వద్ద ఆటోను తప్పించబోయి బోల్తా కొట్టింది. దీంతో బస్సులోని 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచరం. గాయపడిన వారు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement