విజయవాడ : పుష్కరాల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అధికారులు అలసత్వం వహించకుండా బా«ధ్యతాయుతంగా పని చేయాలని మున్సిపల్ కమిషనర్ జి. వీరపాండియన్ కోరారు. సోమవారం గాంధీనగర్లో కందుకూరి కళ్యాణ మండపంలో పుష్కర విధులకు హాజరయ్యే సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిబ్బంది విధి విధానాలపై మున్సిపల్ కమీషనర్ దిశా నిర్దేశం చేశారు. వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుండి వచ్చిన అదికారులు, సిబ్బందితో పాటు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు 3 షిప్టులుగా 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరనగర్లు, పుష్కర ఘాట్లలో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొను గదులు, తాగునీటి సరఫరా తదితర ప్రధానమైన మౌళిక సదుపాయాలపై ఎటవంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు టాయిలెట్లను ఫినాయిల్, బ్లీచింగ్లతో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఘాట్ల వద్ద షిప్టు వారీగా విధులు నిర్వహించే వారు తరువాత షిప్ట్నందు సిబ్బంది వచ్చే వరకు విధులలో ఉండి ఆ ఘాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం అందించి విధుల నుండి రిలీవ్ అవ్వాలన్నారు. నగర పాలక సంస్థ అధికారులతో పాటు వివిధ మున్సిపాలిటీల నుండి వచ్చిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పుష్కరాల్లో బాధ్యతగా పనిచేయండి
Published Mon, Aug 8 2016 10:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోదావరి వరదల సమయంలోనూ..
ఊహించని పరిహారం
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
గంటల్లోనే పరిహారం
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
మనసున్న ముఖ్యమంత్రి జగన్
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement