అనంతపురం అర్బన్ : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో పద్ధతిలో 21 రోజుల్లో అనుమతులివ్వాలని అధికారులను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. పరిశ్రమలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను అందించే క్రమంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీపీఐసీ) సమావేశం కలెక్టర్ అధ్యోతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరులో జాప్యం చేయడం వల్ల లక్ష్యం నెరవేదన్నారు. సమావేశంలో దరఖాస్తుదారుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్బాబు వివరించారు. ఆన్లైన్లో నమోదైన ప్రతి దరఖాస్తుని కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారుడు స్థాపించిన పరిశ్రమ, దాని పనితీరుని పరిశీలించి అనుమతులు మంజూరు చేశారు.
లబ్ధిదారుల యూనిట్లను జియోట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. 31 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ కోరుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 27 పరిశ్రమలకు రూ.4.27 కోట్లు పెట్టుబడి రాయితీ మంజూరుకు ఆమోదం తెలిపారు. నాలుగింటిని తిరస్కరిస్తూ వాటిని మరోమారు విచారణ చేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మీ సేవ ద్వారా నమోదైన దరఖాస్తుల్లో 821 ప్రతిపాదనల్లో 104 ప్రతిపాదనలను మళ్లీ సమీక్షిస్తామన్నారు. హిందూపురం, గుడిపల్లి, గుత్తిలో ఉన్న పారిశ్రామిక వాడలో పరివ్రమలు స్థాపించేందుకు ఎనిమిది ప్లాట్లు కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. కదిరి మండలం కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పరిధిలో నిరంత విద్యుత్ సరఫరాకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎక్స్ప్రెస్ ఫీడర్ 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ రఘునాథ్ని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రసాద్రెడ్డి, ఎల్డీఎం జయశంకర్, డీపీఓ జగదీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిద్దాం
Published Tue, Jun 13 2017 8:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement