ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Published Sun, Aug 28 2016 10:47 PM

Follow the Traffic Rules

పెద్దకొత్తపల్లి : వాహనాలు నడిపే వారు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ సైదయ్య సూచించారు. ఆదివారం నాయినిపల్లి మైసమ్మ జాతరకు వెళ్లే వాహనాలను పెద్దకార్పుపాముల రోడ్డు వద్ద ఆయన తనిఖీ చేశారు. డ్రైవింగ్‌ లైసన్స్, రిజిస్ట్రేషన్, ఇతర పత్రాలు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని సూచించారు. ఈ సందర్భంగా పలువురికి జరిమానాలు విధించారు. తనిఖీలో సిబ్బంది కష్ణ, వెంకటేశ్వర్లు, డానీ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement