అనంతపురం అగ్రికల్చర్: అకారణంగా తమను విధుల నుంచి తొలగించడంతో ఉపాధిలేక రోడ్డున పడ్డామని విధుల నుంచి తొలగించిన గోపాలమిత్రల సంఘం నాయకుడు వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం అందరి వద్ద మోకరిల్లుతున్నా... తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి తీసుకోవాలంటూ స్థానిక పశుశాఖ, డీఎల్డీఏ కార్యాలయం ఎదుట గోపాలమిత్రలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం బుధవారం 12వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా గోపాలమిత్రలు కలెక్టరేట్ ఎదుట మూగిటలు చేతపట్టుకుని భిక్షాటనతో నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఉపాధి లేక రోడ్డున పడిన తమకు భిక్షం వేయాలని కోరారు. డీఎల్డీఏ ఓవో కక్షకట్టి తమను తొలగించారని విమర్శించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దన్న, ఓబుళపతి, గురివిరెడ్డి, ఓబయ్య, జగన్మోహన్రెడ్డి, శివారెడ్డి, బాలరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భిక్షాటనతో గోపాలమిత్రల నిరసన
Published Wed, Aug 30 2017 10:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement