తెలంగాణ హరితహారానికి ప్రపంచఖ్యాతి | Sakshi
Sakshi News home page

తెలంగాణ హరితహారానికి ప్రపంచఖ్యాతి

Published Sun, Jul 24 2016 11:46 PM

మొక్కలు నాటుతున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  •  
  • ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడి
    నేలకొండపల్లి: సీఎం కేసీఆర్‌ చేపట్టిన తెలంగాణ హరితహారానికి ప్రపంచ స్థాయి ఖ్యాతి లభించిందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శ్రీభక్తరామదాసు సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 8 నుంచి ప్రారంభించిన హరితహారం పథకం నిరంతరం కొనసాగుతుందన్నారు. వేసిన ప్రతి మొక్కను రక్షించుకోవాలని, మొక్కలు మానవ మనగడకు మూలాధారమని, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు అర్వపల్లి రామారావు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీపీ అధ్యక్షురాలు కవితారాణి, జెడ్పీటీసీ సభ్యురాలు అనిత, జిల్లా నాయకులు కోటి సైదారెడ్డి, కొర్లకుంట్ల నాగేశ్వరరావు, వెనికె జానకిరామయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు వెన్నపూసల సీతారాములు, నల్లాని మల్లిఖార్జున్‌రావు, నాయకులు చెరువు స్వర్ణ, మాదాసు శ్రీనివాసరావు,  సీతారావమ్మ, శీలం వెంకటలక్ష్మి, మానుకొండ దుర్గారావు, తలశిల రాధాకృష్ణ, ఉండమోదుగుల వెంకటేశ్వర్లు, ఆనం వెంకటరెడ్డి, కడియాల నరేష్, నూక నాగయ్య, పెద్దపాక వెంకటేశ్వర్లు, యండ్రాతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement