జవహర్నగర్(రంగారెడ్డి జిల్లా): మూడు మూళ్లు.. ఏడు అడుగులు.. కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణం.. అన్ని మరిచి కట్టుకున్న వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అయిదేళ్ల కూతురు పక్కనే నిద్రపోతూ ఉన్నా.. భార్యను బెల్ట్తో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన జవహర్నగర్లోని మార్వాడీలైన్లో చోటుచేసుకుంది.
సీఐ నర్సింహారావు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజేష్కు, ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గౌతమి(25)తో 2009 మే 9న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.2లక్షల యాభై వేల రూపాయలు కట్న కానుకల కింద ఇచ్చారు. వీరికి ఐదేళ్ల కూతురు వర్షిక ఉంది. బతుకుదెరువు కోసం సికింద్రాబాద్లోని అడ్డగుట్టకు వలస వచ్చిన రాజేష్ ప్రింటింగ్ప్రెస్లో పనిచేస్తుండగా, గౌతమి సికింద్రాబాద్లోని యూనినార్ స్టోర్లో పనిచేస్తూ ఆరు నెలల కిందట జవహర్నగర్లోని మార్వాడీలైన్లో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. రాజేష్కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని గౌతమి అతనితో రెండేళ్లుగా గొడవపడుతోంది. రాజేష్ కొంతకాలంగా వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఆమెతో చనువుగా ఉండి పెళ్లి చేసుకోవాలని సిద్ధపడుతున్నాడని గౌతమి తమ తల్లిదండ్రులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువురి కుటుంబీకులు పలుమార్లు పంచాయితీ చేసి సర్దిచెప్పారు.
అయినా రాజేష్ ప్రవర్తనలో మార్పురాలేదు. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరగుతున్నాయి. మంగళవారం రాత్రి ఇరువుకి కొంతసేవు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాజేష్ గౌతమీని బెల్ట్తో గొంతు నులిమి హత్య చేశాడు. తెల్లవారుజామున గౌతమి ఆత్మహత్య చేసుకుందని బంధువులకు తెలిపిన రాజేష్ జవహర్నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు.
మహిళ ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న శామీర్పేట తహసీల్ధార్ రవీందర్రెడ్డి సంఘటనా స్ధలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం జవహర్నగర్ సీఐ నర్సింహరావు వివరాలు సేకరించి తమదైన శైలిలో రాజేష్ను అడగగా తానే క్షణికావేశంతో గౌతమిని బెల్ట్తో గొంతునులిమి చంపేశానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గొంతు నులిమి గౌతమిని చంపేశాడు!
Published Tue, Apr 26 2016 8:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement