Sakshi News home page

వాడపల్లిలో నిఘా షురూ

Published Tue, Aug 2 2016 10:45 PM

వాడపల్లిలో నిఘా షురూ


ఫ్లడ్‌లైట్లు ఏర్పాట్లు

వాడపల్లి(దామరచర్ల)
 ప్రముఖ పుణ్యక్షేత్రం దామరచర్ల మండలం వాడపల్లిలో పుష్కరాల సందర్భంగా నిఘా ఏర్పాట్లను ప్రారంభించారు. పుణ్యక్షేత్రంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాలు మరో పదకొండు రోజులుండగానే ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్నానఘాట్,పార్కింగ్,దేవాలయ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పుణ్యక్షేత్రంలో పలు చోట్ల ఇప్పటికే ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తయినచోట్ల లైటింగ్‌ టెస్ట్‌ చేస్తున్నారు.


 

Advertisement

What’s your opinion

Advertisement