పెరవలి : కంద దిగుబడి ఆశాజనకంగా ఉన్నా మార్కెట్లో గిట్టుబాటు ధరలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో కంద పంట 2 వేల హెక్టార్లలో సాగులో ఉంది. జూన్ నుంచి కంద దిగుబడి సీజన్ ప్రారంభమవుతుంది. జూన్లో పుట్టు (236 కిలోలు) ధర రూ. 8 వేలు ఉండగా జూలైలో రూ.6 వేలు పలికింది. ఈ నెలకు వచ్చేసరికి అకస్మాత్తుగా ధర తగ్గి రూ.3,500 పలుకుతోంది. ధర పతనంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరం కంద పంట సాగు చేయాలంటే రూ.1.80 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. ఈ ఏడాది విత్తనానికే దాదాపు రూ.1.30 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. విత్తన దుంపలు పుట్టు రూ.4,500 చేసి కొనుగోలు చేశారు. పెరవలి మండలంలో తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, నల్లాకులవారిపాలెం, ఖండవల్లి, లంకమాలపల్లి, అన్నవరప్పాడు, మల్లేశ్వరం, కడింపాడు గ్రామాల్లో ఈ కందను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి ముంబై, కోల్కతా, నాగపూర్, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ ఏడాది ఇతర ప్రాంతాల్లో కూడా పంట బాగుండడం, దిగుబడులు పెరగడంతో ధర పతనమైనట్టు వ్యాపారులు తెలిపారు. మెట్ట ప్రాంతంలో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. గత రెండేళ్లలో కందను సాగుచేసిన రైతులు ఎకరానికి రూ. 20 నుంచి రూ. 40 వేల వరకు నష్టాలు చవిచూశారు. జూన్లో దుంపలు తీసిన రైతులు గట్టెక్కగా గత రెండు నెలల్లో తీసిన రైతులు బాగా నష్టపోయారు.
కంద ధర పతనం
Published Wed, Aug 24 2016 12:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement