జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
♦ ఏటా 1800పైగా ప్రమాదాలు
♦ మృతులు 600 పైమాటే
♦ ద్విచక్ర వాహన ప్రమాదాలే అధికం
♦ జిల్లాలో 47 బ్లాక్ స్పాట్ల గుర్తింపు
♦ అతివేగం, నిద్ర, నిర్లక్ష్యంతోనే అధిక ప్రమాదాలు
♦ ప్రాణాలు తీస్తున్న అధ్వాన రహదారులు
♦ జిల్లాలో దెబ్బతిన్న రహదారులు 737 కిమీ
♦ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం
వాహనంపై బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి వస్తాడో, లేదోననే భయం నేడు కుటుంబ సభ్యులను వెన్నాడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. రోజూ ఏదొక ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకోవడం.. విలువైన ప్రాణాలు కోల్పోవడం..ఆందోళన కల్గిస్తోంది. నాగరికతకు చిహ్నాలైన రహదారులు ఛిద్రమవడం.. మలుపుల వద్ద ప్రమాద సూచికలు లేకపోవడం..అతివేగం.. ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. జిల్లాలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్నా వాటి నివారణకు చేపట్టిన చర్యలు చాలా తక్కువేనని చెప్పవచ్చు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) :
జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. యేటా సరాసరిగా 1,800పైగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏటా 600 మందిపైగా మృత్యువాత పడుతన్నారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో చనిపోతున్నా వారే 25 శాతం మంది ఉండడం గమనార్హం. వేగంగా ప్రయాణించడం.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం..అధ్వాన రహదారులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు చేపట్టిన చర్యలు తూతూమంత్రమే అని చెప్పవచ్చు.
మృత్యు గుంతలు..
రహదారులపై ఒక్కసారిగా వచ్చే గుంతలతో ద్విచక్రవాహనదారులు ఎక్కువగా ప్రమాదం బారినపడుతున్నారు. దీనికి తోడు యువత అతివేగంతో ముందు వెళ్లే వాహనాలను ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టించడం, వేగం అదుపుతప్పడం తదితర కారణాలతో యేటా 440పైగా ద్విచక్రవాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో సరాసరిగా యేటా 150 మంది చనిపోతున్నారు. మృతుల్లో ఎక్కువగా 25 ఏళ్లలోపు యువత ఉండడం గమనార్హం.
ఉత్తుత్తి భద్రతా వారోత్సవాలు...
యేటా పోలీసులు, ఆర్టీసీ, ఆర్టీఓ అధికారులు ఉమ్మడిగా రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కోసం సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారు. వీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అవన్నీ ఆచరణలోమాత్రం కనిపించడంలేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
పడకేసిన ఇంటర్సెక్టార్ సేవలు
కర్నూలు జిల్లాలో రోడ్డు భద్రతా పరంగా ఆరుసబ్ డివిజన్లు ఉన్నాయి. మొత్తం జిల్లాలో సుమారు 6.46 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలే సుమారు లక్ష వరకు ఉండవచ్చు. సబ్ డివిజన్ల పరిధిలో పోలీసు స్టేషన్లు పరిధిలో నిరంతరం తనిఖీలు చేస్తే అతివేగానికి కళ్లెం వేయవచ్చు. అతివేగంతో దూసుకొస్తున్న వాహనాలను నిలుపదల చేసేనాథుడు కనిపించడంలేదు. జాతీయ, రాష్ట్రీయ, జిల్లా రహదారుల్లోనూ అతివేగంతో వస్తున్న వాహనాలు అధికంగానే కనిపిస్తున్నాయి. వీటిని నిరోధం కోసం జిల్లాకు కేటాయించిన ఇంటర్సెక్టార్ సేవలు పడకేశాయి.
నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఇవే..
⇔ జాతీయ రహదారిపై ఉన్న ఓర్వకల్లు
⇔ కర్నూలులో వెంకటరమణ కాలనీ మలుపు
⇔ ఆదోని మండలం పెద్ద తుంబళం వద్ద
⇔ ఆస్పరి మండలంలో కొన్ని ప్రదేశాలు..
⇔ కర్నూలు–కడప జాతీయ రహదారిపై అల్ఫా కళాశాల
⇔ పాణ్యం మండలం సుగాలి తండా
⇔ ప్యాపిలి మండలం పరిధిలోని కొన్ని ప్రదేశాలు
⇔ బళ్లారి చౌరస్తా నుంచి దేవనకొండ వరకు రోడ్డు విస్తరణ పనులుసాగుతుండడంతో 57 కీమీటర్ల మేర ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.ఇక్కడ సరైన సూచిక బోర్డులను కూడా అధికారులు ఏర్పాటు చేయించలేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
బ్లాక్ స్పాట్స్..
ఒకే ప్రదేశంలో పది కంటే ఎక్కువసార్లు ప్రమాదం జరిగితే దానిని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. జిల్లాలో 47 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆర్అండ్బీ రహదారుల్లో 14 ప్రదేశాలు, ఎన్హెచ్–44 అనంతపురం రహదారిలో 28, ఎన్హెచ్–40 నంద్యాల పరిధిలో 02, పురపాలక కార్పొరేషన్ పరిధిలో ఒక్క బ్లాక్ స్పాట్ను గుర్తించారు. ఇందులో రెండు బ్లాక్ స్పాట్లలో మాత్రమే ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మిగిలిన 45 ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. 2017 మే నెలలో ప్రమాదాల రేటు 37 శాతం నమోదైంది.
రహదారుల రక్తదాహం!
Published Thu, Sep 14 2017 9:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement