'టీడీపీ, బీజేపీ పబ్బం గడుపుతున్నాయి' | Sakshi
Sakshi News home page

'టీడీపీ, బీజేపీ పబ్బం గడుపుతున్నాయి'

Published Sun, Oct 25 2015 12:45 PM

Malladi vishnu takes on tdp and bjp

విజయవాడ : టీడీపీ, బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం విజయవాడలో మండిపడ్డారు. కాంగ్రెస్ను తిడుతూ ఆ రెండు పార్టీలు పబ్బం గడుపుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు బీజేపీనే మూలకారణమని ఆయన విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా... ఈ నెల 31న ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.
 

Advertisement
Advertisement