విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Published Wed, Oct 28 2015 4:00 PM

Man dies with power shot in Adilabad district

కెరిమెర(ఆదిలాబాద్ జిల్లా) ఆదిలాబాద్ జిల్లా కెరిమెర మండలం జోడేఘాట్ గ్రామంలో బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. మహారాష్ట్ర సరిహద్దులోని వాంక్రీ గ్రామానికి చెందిన పుర్తెంగరావు(40) తన మేనమామ ఇంటికి జోడేఘాట్‌కు వచ్చాడు.

బుధవారం మధ్యాహ్నం ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement