అనుమానాస్పద మృతి కేసు నమోదు | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద మృతి కేసు నమోదు

Published Mon, Aug 29 2016 1:42 AM

man suspicious death

ఏలూరు అర్బన్‌ : రోడ్డు పక్క మృతదేహం పడి ఉండటంతో ఏలూరు టూటౌన్‌ పోలీసులు అనుమాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఎస్సై అల్లు దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఏలూరు రైలే ్వస్టే షన్‌కు వెళ్లే గూడ్స్‌షెడ్‌ రోడ్డు మార్జిన్‌లో గుర్తుతెలియని మృతదేహం పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై దుర్గారావు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి మృతుని వివరాలు సేకరించారు. మృతుడు నగరానికి చెందిన అలవా పుల్లారెడ్డి కుమారుడు వెంకట్‌ (27)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరణ మేరకు మృతుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అయితే వివరాలపై స్పష్టత లేనందున అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement