సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ఉత్పత్తుల విలువను పెంచి గిట్టుబాటు ధర కల్పించడం, 2020 నాటికి రూ.ఐదు వేల కోట్లతో పరిశ్రమలు స్థాపించి, 50 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని రూపొందించింది. కొబ్బరి, పొగాకు బోర్డుల తరహాలోనే తిరుపతిలో మామిడి బోర్డు.. పశ్చిమగోదావరి జిల్లాలో అరటి బోర్డు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అరటి బోర్డు ఏర్పాటుకు రూ.పది కోట్లు మంజూరు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ 30 ఎకరాల్లో ‘ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కు’లు ఏర్పాటుచేయనున్నారు. ఈ విధానం 2015 నుంచి 2020 వరకూ అమల్లో ఉంటుంది. 2014-15లో స్థూల రాష్ట్రీయోత్పత్తి(జీఎస్డీపీ) రూ.5,20,030 కోట్లు. ఇందులో వ్యవసాయ రంగం వాటా 23.3 శాతం. 2015-16లో స్థూల రాష్ట్రీయోత్పత్తి రూ.6,36,606 కోట్లుగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రైతుల ఉత్పత్తులకు విలువను పెంచగలిగితే గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటూ జీఎస్డీపీని పెంచవచ్చునని భావిస్తున్నారు. మామిడి, అరటి, టమాటా వంటి ఉద్యానవన పంటల సాగులో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉందని భావించిన ప్రభుత్వం.. ఆ రంగంలో పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు కల్పిస్తూ విధానాన్ని రూపొందించింది.
ఫుడ్ ప్రాసెసింగ్ విధానంలో ముఖ్యాంశాలు
# 2015-20 పారిశ్రామిక విధానం ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రాయితీపై భూములు కేటాయింపు
# ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా
# భూమార్పిడి పన్ను వంద శాతం రీయింబర్స్మెంట్
# ప్రైమరీ ప్రాసెసింగ్ కేంద్రాలకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 50 శాతం.. గరిష్టంగా రూ.2.50 కోట్లు ప్రభుత్వ రాయితీ
# పరిశ్రమ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి పెట్టుబడిపై ఏడు శాతం వడ్డీ రాయితీ
# మార్కెట్ పన్ను నుంచి మినహాయింపు
# ఐదేళ్లపాటు వ్యాట్, సీఎస్టీ, ఎస్జీఎస్టీ వంద శాతం రీయింబర్స్మెంట్
తిరుపతిలో మామిడి బోర్డు
Published Sun, Jul 26 2015 12:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement