ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

Published Thu, Sep 29 2016 10:17 PM

హుంజా మృతదేహం - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఘటన
దుమ్ముగూడెం : జిల్లా సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నీలమడుగు అటవీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నీలమడుగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో డిస్ట్రిక్ట్‌ రిజర్వుడ్‌ గ్రూప్‌(డీఆర్‌డీ) స్పెషల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో పోలీసులు మావోలపై ఎదురు కాల్పులకు దిగారు. దీంతో కుంట మావోయిస్టు ఎల్‌ఓసీ సభ్యుడు మండకం హుంజా అక్కడికక్కడే మృతిచెందాడు. మరికొందరు మావోయిస్టులకు గాయాలైనట్లు పోలీసుల తెలిపారు. కాగా.. సంఘటనా స్థలంలో ఒక తుపాకి, కొంత విప్లవ సాహిత్యం లభ్యమైంది. అయితే దండకారణ్యంలో కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు సమాచారం.
 

Advertisement
Advertisement