పిల్లలు పుట్టడం లేదని.. | Sakshi
Sakshi News home page

పిల్లలు పుట్టడం లేదని..

Published Thu, May 5 2016 4:35 PM

Married woman committed suicide

 పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నంద్యాల పట్టణంలోని ఎంఎస్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఎంఎస్‌నగర్‌కు చెందిన భాషాతో పర్వీన్(28)కు 8 సంవత్సరాల క్రితం పెళ్లయింది. పెళ్లై ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు కాకపోవడంతో ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement