ఖమ్మం : ప్రేమ పేరుతో తనను నిత్యం వేధిస్తున్నాడని యువకుడిపై ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని తెల్దార్పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక (16) ఖమ్మంలోని ఓ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ బస్సులో కళాశాలకు వెళ్లి వస్తోంది.
ఈ క్రమంలో.. అదే గ్రామానికి చెందిన భాస్కర్ (24) అనే వ్యక్తి తనని ప్రేమించాలని.. పుట్టిందే నీకోసమని.. నువ్వులేకపోతే చచ్చిపోతానని అంటూ రోజూ బాలిక వెంట పడి వేధిస్తున్నాడు. దాంతో సదరు బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దాంతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.