‘రాజు’కుంటోంది!
• ఎమ్మెల్యే రాజు వెర్సెస్ పీవీఎస్ఎన్ రాజు
• తారస్థాయికి టీడీపీ గ్రూపు రాజకీయాలు
• భక్తులకు సేవల్లోనూ రాజకీయ ద్వేషాలు
రావికమతం : చోడవరం టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. రావికమతం మండలం కళ్యాణపులోవ తిరునాళ్లలో తారాస్థాయికి చేరుకున్నాయి. ఏటా ఇక్కడి పోతురాజుబాబు ఆలయం వద్ద టీడీపీ నాయకుడు పీవీఎస్ఎన్ రాజు రెండెకరాల స్థలాన్ని చదును చేయించి భారీగా షామియానాలు వేయించేవారు. శివరాత్రి జాతరకు ఇక్కడికి వచ్చే వేలాది మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించి, జాతరలో జాగారానికి పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసేవారు. చిటెకెల భజన, చెట్టుభజన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా టెంట్లు వేయించి, స్నానాల రేవుకు చేరుకోలేని వృద్ధులు ,చిన్నారుల కోసం ప్రత్యేక మోటార్లు,పైపులైన్తో గట్టువద్ద నీటిజల్లు ఏర్పాటు చేసేవారు. దీనికి వివిధ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాకరించేవారు. ఇదంతా ఎమ్మెల్యే రాజుతో పాటు, ఆయన వర్గీయులకు కంటగింపుగా మారింది. ఒకే పార్టీలో మరోబలమైన గ్రూపును తయారుచేస్తున్నందున పీవీఎస్ఎన్ రాజు వద్దకు వెళ్లవద్దంటూ పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులకు పరోక్షంగా హుకుం జారీఅయింది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని ఆయన వద్దకు వెళ్లే సర్పంచ్లు,ఎంపీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపు ఉండదంటూ ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్యే మాటగా ఎంపీపీ దంగేటి రామకృష్ణ పదేపదే తెగేసి చెబుతున్నారు. దీంతో ఆపార్టీకి చెందిన వారెవ్వరూ పీవీఎస్ఎన్ను నేరుగా కలవడంలేదు. ఈ ఏడాది కళ్యాణపులోవ తిరునాళ్లులో పీవీఎస్ఎన్ రాజు భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేసినా నలుగురు ఐదుగురు మినహా టీడీపీ వారంతా దూరంగా ఉన్నారు.
ఈ ఏడాది ఎమ్మెల్యే వర్గీయులు ఇంకా పట్టుబిగించారు. తిరునాళ్లలో అన్నసమారాధన చేపట్టాలన్నా తన అనుమతి తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాజు నొక్కి చె ప్పారు. ఎవరెవరు ఏఏ సేవా కార్యక్రమాలు చేపడుతున్నదీ తనకు ముందుగా చెబితే క్రమ పద్ధతిలో నిర్వహించేలా సూచనలిస్తానని ఉత్సవకమిటీ సభ్యులచే దాతలందరికీ చెప్పించారు. ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది తిరునాళ్లుకు రూ.22 లక్షలు ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయించి సుమారు 20 ఎకరాల్లో చదును చేయించారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజు కనుసన్నల్లోనే పనులన్నీ జరుగుతున్నాయి. ఉచిత అన్నసమారాధనకు 24 కౌటర్లు సిద్ధం చేశారు. అందులో ఒకటి పీవీఎస్ఎన్ రాజుకు కేటాయిస్తున్నట్టు ఆయనకు అనుచరుల ద్వారా కబురు పంపారు. అదీకూడా ఒకే కూర,సాంబారు అన్నం పెట్టాలని.. ధనబలముందని రెండు మూడు కూరలు పెట్టకూడదని, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదని సమాచారం పంపారు. దీంతో పీవీఎస్ఎన్ రాజు మనస్థాపం చెంది ఏర్పాట్లు ఆపేశారు.
ఎమ్మెల్యే రాజు (వెర్సెస్) పీవీఎస్ఎన్ రాజు
Published Mon, Mar 7 2016 3:45 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement