'మరో అవతరణ దినోత్సవం అవసరం లేదు' | Sakshi
Sakshi News home page

'మరో అవతరణ దినోత్సవం అవసరం లేదు'

Published Thu, Sep 17 2015 11:01 AM

'మరో అవతరణ దినోత్సవం అవసరం లేదు' - Sakshi

హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుండగా, మరో అవతరణ దినోత్సవం అవసరం లేదని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన గురువారం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యబద్దంగా విలీనమైంది ఈ రోజేనని నాయిని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసి వ్యక్తి అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని కోరాం..కానీ జూన్ 2 న అవతరణ దినోత్సం నిర్వహిస్తున్నందున ఇంకో కార్యక్రమం ఎందుకని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement