ఆత్రేయపురం : జిల్లా వ్యాప్తంగా 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసిందని పశు సంవర్ధక శాఖ జేడీ వి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పులిదిండి, కట్టుంగ గ్రామాల్లో పశు వైద్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 18 నుంచి 31 వరకు ఆయా గ్రామాల్లో 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపీణీ చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ మందు వల్ల పశువుల్లో పారుడు తగ్గి త్వరగా ఎదకు వచ్చి పాలదిగుబడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 50 వేల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు. అలాగే పశువులకు సంబంధించి జిల్లాలో 450 బోన్లు, గ్రామ స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొలంలో గడ్డి పెంచితే డెల్టా పరిధిలోని 18 వేలు, వెస్ట్రన్ డెల్టాలో రూ.20వేలు, మెట్టప్రాంతంలో రూ.16వేలు, ఏజెన్సీలో రూ.10 వేలు అందిస్తామన్నారు. పశుగ్రాసాన్ని కిలో రూపాయికి అందించాలని రైతులకు సూచించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అజోల్లా నాచు పెంచుకునేందుకు కిట్లు పంపిణీ చేస్తామన్నారు. కిట్ ఒక్కంటికి రూ.3250 కాగా రూ.325కి అందజేస్తున్నామన్నారు. నాచు, తవుడు నీళ్లల్లో కలిపి పశువులకు పెట్టడం ద్వారా అవి ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి పెరుగుతుందన్నారు. పశుమిత్రలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆత్రేయపురం, ర్యాలి పశువుల ఆస్పత్రి నిర్మాణాలకు ఒకొక్క భవనానికి రూ.16లక్షలు మంజూరయ్యాయన్నారు. గొర్రెలకు సంబంధించి వచ్చే నెల 5 నుంచి 15 వరుకు శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఆయన ఆత్రేయపురం పశువైద్యశాలను పరిశీలించారు. డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, సర్పంచ్లు కనుమూరి ప్రసాదవర్మ, దొడ్డపనేని వెంకట్రావు, ఎంపీటీసీలు గొలుగులవాణి, దండు రాంబాబు, పశుసంవర్ధక శాఖ డీడీ గాబ్రియేల్, ఏడీ విశ్వేశ్వరరావు, వెలిచేరు, ర్యాలి పీహెచ్సీ వైద్యాధికారులు యు.ముఖేష్, రవి తేజ, వైద్య సిబ్బంది సూర్యనారాయణ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ
Published Sat, Jul 23 2016 11:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement