పనిచేయని బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు | Sakshi
Sakshi News home page

పనిచేయని బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు

Published Fri, Oct 14 2016 12:00 AM

not working in bsnl land lines

కాశినాయన: మండల కేంద్రమైన నరసాపురం గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దారు కార్యాలయం, మీసేవ, ఎంపీడీఓ కార్యాలయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు పనిచేయకపోవడంతో ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గత 5 రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ఫోన్లు మూగబోయాయి. దీంతో ఇంటర్నెట్‌ పనిచేయక ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు తెలియచేసినా పట్టించుకోలేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.


 

Advertisement
Advertisement