► రూ.500, వెయ్యి నోట్లను తీసుకోని ప్రైవేట్ ఆస్పత్రులు
► ప్రైవేట్ మందుల దుకాణాల్లోనూ అదే పరిస్థితి
విజయనగరం ఫోర్ట్ : డెంకాడ మండలానికి చెందిన సత్యం.. తన కుమార్తెను ప్రసవం కోసం విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేర్చగానే వైద్య పరీక్షలు, డాక్టర్ ఫీజుకు రూ.1000 అరుుంది. దీనికోసం తన దగ్గర ఉన్న రెండు రూ.500 నోట్లను ఇచ్చాడు. అరుుతే ఆస్పత్రి నిర్వాహకులు వాటిని తీసుకోలేదు. దీంతో తన బంధువులకు ఫోన్ చేసి చిల్లర తెప్పించుని ఆస్పత్రిలో బిల్లు చెల్లించాడు.
విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీకి చెందిన ఆర్.శ్రీనివాస్ అనే వ్యక్తి.. మందులు కొనుగోలు చేయడానికి మెడికల్ షాపునకు వెళ్లాడు. మందులకు రూ.300 అరుుందని చెప్పగా.. శ్రీనివాస్ రూ. 500 నోటు ఇచ్చాడు. ఆ నోటు దుకాణం యాజమాని తీసుకోలేదు. దీంతో చేసేది లేక ఇంటికి వెళ్లి మళ్లీ రూ.300 తెచ్చి ఇచ్చి మందులు తీసుకున్నాడు. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న రోగులకు ఎదురువుతున్న దుస్థితి. ఏటీఎంల్లో రూ.2 వేలు నోటు మాత్రమే రావడం.. కొన్ని ఏటీఎంలు పని చేయకపోవడం వల్ల చిల్లర దొరకడం కష్టంగా మారింది. రూ.500 నోటు తీసుకోవాలని కేంద్రం చెప్పినా ఆస్పత్రులు పట్టించుకోవడం లేదు. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. పాత నోట్లు తీసుకోక.. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 200 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి.
987 మందుల దుకాణాలు ఉన్నారుు. రూ.500, వెరుు్య నోట్లను రద్దు చేసి 20 రోజులు అవుతున్నా.. చిల్లర కోసం బ్యాంకుల చుట్లూ జనం ఇంకా పాట్లు పడుతూనే ఉన్నారు. మందుల దుకాణాల్లో రూ.500 నోటు తీసుకోవాలన్న నిబంధన ఉన్నా.. సంబంధిత యజమానులు పట్టించుకోవడం లేదు. నగదు రహిత సేవల కోసం అన్ని ఆస్పత్రులూ, మందుల దుకాణాల్లోను స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. రెండు ఆస్పత్రుల్లోనే అవి అందుబాటులో ఉన్నారుు. స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుంటే ఆదాయపు పన్నుశాఖ అధికారులకు లెక్కలు చూపాల్సి వస్తుందని చాలామంది ఏర్పాటుకు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణులు వినిపిస్తున్నారుు.
డిసెంబర్ 15వ తేదీ వరకు రూ.500 నోటు తీసుకోవాల్సిందే..
మందుల దుకాణాల్లో డిసెంబర్ 15వ తేదీ వరకు రూ.500 నోటు తీసుకోవాల్సిందే. ఎవరైనా తీసుకోకపోతే మాకు ఫిర్యాదు చేయవచ్చు. - ఎన్.యుగంధర్, డ్రగ్ ఇన్స్పెక్టర్
ఫిర్యాదు చేయవచ్చు..
చిల్లర లేదని వైద్యం చేయనని అనడం సరికాదు. మానవతా ద్పక్పథంతోనైనా వైద్యం అందించాలి. ఆస్పత్రుల్లో రూ.500 నోటు తీసుకోకపోతే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. చర్యలు తీసుకుంటాం. - సి.పద్మజ, డీఎంహెచ్ఓ
చిల్లర ఉంటేనే వైద్యం
Published Tue, Nov 29 2016 4:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement