-
‘కన్సల్టేషన్’ కనికట్టు!
కార్పొరేట్ వైద్యం ఖరీదని అందరికీ తెలుసు. వైద్య చికిత్సలే కాదు మినిమమ్ కన్సల్టెన్సీ కూడా ఇప్పుడు బహు ఖరీదుగా మారింది. సాధారణంగా ఏదైనా జబ్బు చేసినా...అలాంటి లక్షణాలు కన్పించినా ముందు రోగమేంటో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించక తప్పదు. ఇలా సంప్రదించడంతోనే కార్పొరేట్ దోపిడీ ప్రారంభమవుతోంది. జబ్బేంటో తెలియక ముందే రూ.500 నుంచి రూ.1000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే రూ.100 లేదా రూ.150 చెల్లించే వారు. అదే ఫీజుపై మరో రెండుసార్లు చెక్ చేయించుకొనే సదుపాయం ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. కన్సల్టేషన్ ఫీజులు అమాంతం పెంచేయడమే కాకుండా...దాన్ని ఒక్కసారి చెకింగ్కే పరిమితం చేస్తున్నారు. మరోసారి వైద్యుడ్ని సంప్రదించాలంటే మరో వెయ్యి సమర్పించాల్సిందే. జనరల్ ఫిజీషియన్ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే భారీగా కన్సల్టేషన్ ఫీజు ఇవాల్సి వస్తోంది. ఇటీవల బేగంపేటలోని ఓ ఆస్పత్రిలో డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి చికిత్స అందించినందుకు స్పెషలిస్టు ఒక విజిట్ కన్సల్టేషన్ చార్జీ రూ.7 వేలు వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్ల్లో సైతం డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు అమాంతం పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యుల కన్సల్టేషన్, రిజిస్ట్రేషన్ చార్జీలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. సాధారణ వైద్యుడు నాడీ పడితే చాలు రూ.500 చెల్లించుకోవాల్సిందే. జనరల్ ఫిజిషియన్ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే రూ.800 నుంచి రూ.1000 వరకు ఇవాల్సిందే. పదేళ్ల క్రితం పరిస్థితికి ప్రస్తుతానికి భారీ తేడా కనిపిస్తోంది. ఒకప్పుడు వైద్యుడి కన్సల్టేషన్ రూ.100 నుంచి రూ.150 ఉంటే అదే ఎక్కువ. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవారు. కుటుంబంలో ఎవరికే సమస్య వచ్చినా క్లినికల్ ఎగ్జామ్తోనే పరిష్కారం లభించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జ్వరం, తలనొప్పి, జలుబు వంటి సాధారణ జబ్బులకు కూడా వైద్య పరీక్షలు తప్పనిసరిగా మారాయి. హస్తవాసి బాగున్నట్లు కొంచెం పేరు ఉంటే చాలు అంతకు ఎక్కువే చెల్లించుకోవాల్సివస్తోంది. బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్ల్లో సైతం డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు అమాంతం పెంచేశాయి. ఎన్నిసార్లు విజిట్ చేస్తే.. ఔట్పేషెంట్ల పరిస్థితి ఇలా ఉంటే ఇన్పేషెంట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చికిత్స కోసం అడ్మిటైన రోగి నుంచి సర్జరీ, ఐసీయూ, నర్సింగ్, ఫుడ్, బెడ్చార్జి, కన్సల్టేషన్ ఇలా దేనికవి వేర్వేరుగా వసూలు చేస్తున్నారు. నిజానికి ఒకసారి వైద్యుడి వద్దకు వచ్చిన రోగికి ఆ వ్యాధి తగ్గే వరకు కన్సల్టేషన్ ఫీజు తీసుకోకూడదు. కానీ వైద్యసేవల్లో భాగంగా డాక్టర్ ఎన్నిసార్లు వచ్చి చూస్తే అన్ని సార్లు కన్సల్టేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఒక రోగి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేనాటికి (సర్జరీ కాకుండా) కేవలం డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలే రూ.10వేలకుపైగా ఉంటుందంటే ఆశ్చర్యపోనసరం లేదు. ఇటీవల బేగంపేటలోని ఓ ఆస్పత్రికి డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి చికిత్సలు అందించినందుకు స్పెషలిస్టు ఒక విజిట్ కన్సల్టేషన్ చార్జీ రూ.7 వేలు వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిమ్స్లో ఓపీ చార్జీలు ఇలా.. ప్రతిష్టాత్మక నిమ్స్లో మార్నింగ్ ఓపీ చార్జి రూ.50 ఉండగా, ఇటీవల రూ.100కు పెంచారు. ఈవినింగ్ ఓపీ రూ.300 నుంచి రూ.500కు క్రాస్ కన్సల్టేషన్ చార్జి రూ. 800కు పెంచారు. రెండో చెకప్నకు 14 రోజుల వ్యవధి ఉంటుంది. రోగి చెప్పింది కూడా సరిగా విన్పించుకోరు.. నిజానికి ఓపీలో వచ్చిన రోగికి ఒకసారి ఫీజు చెల్లిస్తే రెండువారాల వరకు ఎలాంటి ఫీజులు తీసు కోకూడదు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగి డాక్టర్ వద్దకు ఎన్నిసార్లు వెళ్లితే..అన్ని సార్లు కన్సల్టేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఫీజు తీసుకుంటున్న వైద్యులు రోగులతో సరిగా మాట్లాడతారా.. అంటే అదీ లేదు. ముందు తమ వద్ద పని చేస్తున్న అసిస్టెంట్ డాక్టర్ వద్దకు పంపిస్తున్నారు. ఆ తర్వాత సీనియర్ డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నారు. రోగి చెప్పింది వినకుండా అసి స్టెంట్స్ చెప్పినదే విని మందులు సూచిస్తున్నారు. వచ్చిన ప్రతి రోగితో మాట్లాడాలంటే.. రోజులో కనీసం 20 మందిని కూడా చూడలేం. అదే అసిస్టెంట్ ఉంటే 80 నుంచి వంద మంది వరకు చూడవచ్చని ఓ స్పెషలిస్ట్ వైద్యుడు స్పష్టం చేశారు. అప్పట్లో ఇన్ని స్పెషలైజేషన్లు లేవు ‘మేం చదువుకునే రోజుల్లో ఇన్ని స్పెషలైజేషన్లు లేవు. ఎండీ సీట్లూ తక్కువే. ప్రైవేటులో డొనేషన్లు కట్టి చదువుకోవడాన్ని నామోషిగా ఫీలయ్యేవాళ్లం. ప్రస్తుతం స్పెషలైజేషన్లు పెరిగాయి. డొనేషన్లు పెరిగాయి. దీంతో చదువుపై పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు వృత్తిలోకి రాగానే భారీగా కన్సల్టేషన్ ఇతర ఫీజు పెంచుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా తమ నిర్వహణ ఖర్చులు రాబట్టుకునేందుకు ఫీజు పెంచుతున్నాయి.’ – డాక్టర్ నరేంద్రనాథ్, మాజీ డైరెక్టర్, నిమ్స్ -
చిల్లర ఉంటేనే వైద్యం
► రూ.500, వెయ్యి నోట్లను తీసుకోని ప్రైవేట్ ఆస్పత్రులు ► ప్రైవేట్ మందుల దుకాణాల్లోనూ అదే పరిస్థితి విజయనగరం ఫోర్ట్ : డెంకాడ మండలానికి చెందిన సత్యం.. తన కుమార్తెను ప్రసవం కోసం విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేర్చగానే వైద్య పరీక్షలు, డాక్టర్ ఫీజుకు రూ.1000 అరుుంది. దీనికోసం తన దగ్గర ఉన్న రెండు రూ.500 నోట్లను ఇచ్చాడు. అరుుతే ఆస్పత్రి నిర్వాహకులు వాటిని తీసుకోలేదు. దీంతో తన బంధువులకు ఫోన్ చేసి చిల్లర తెప్పించుని ఆస్పత్రిలో బిల్లు చెల్లించాడు. విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీకి చెందిన ఆర్.శ్రీనివాస్ అనే వ్యక్తి.. మందులు కొనుగోలు చేయడానికి మెడికల్ షాపునకు వెళ్లాడు. మందులకు రూ.300 అరుుందని చెప్పగా.. శ్రీనివాస్ రూ. 500 నోటు ఇచ్చాడు. ఆ నోటు దుకాణం యాజమాని తీసుకోలేదు. దీంతో చేసేది లేక ఇంటికి వెళ్లి మళ్లీ రూ.300 తెచ్చి ఇచ్చి మందులు తీసుకున్నాడు. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న రోగులకు ఎదురువుతున్న దుస్థితి. ఏటీఎంల్లో రూ.2 వేలు నోటు మాత్రమే రావడం.. కొన్ని ఏటీఎంలు పని చేయకపోవడం వల్ల చిల్లర దొరకడం కష్టంగా మారింది. రూ.500 నోటు తీసుకోవాలని కేంద్రం చెప్పినా ఆస్పత్రులు పట్టించుకోవడం లేదు. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. పాత నోట్లు తీసుకోక.. కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 200 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. 987 మందుల దుకాణాలు ఉన్నారుు. రూ.500, వెరుు్య నోట్లను రద్దు చేసి 20 రోజులు అవుతున్నా.. చిల్లర కోసం బ్యాంకుల చుట్లూ జనం ఇంకా పాట్లు పడుతూనే ఉన్నారు. మందుల దుకాణాల్లో రూ.500 నోటు తీసుకోవాలన్న నిబంధన ఉన్నా.. సంబంధిత యజమానులు పట్టించుకోవడం లేదు. నగదు రహిత సేవల కోసం అన్ని ఆస్పత్రులూ, మందుల దుకాణాల్లోను స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. రెండు ఆస్పత్రుల్లోనే అవి అందుబాటులో ఉన్నారుు. స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుంటే ఆదాయపు పన్నుశాఖ అధికారులకు లెక్కలు చూపాల్సి వస్తుందని చాలామంది ఏర్పాటుకు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణులు వినిపిస్తున్నారుు. డిసెంబర్ 15వ తేదీ వరకు రూ.500 నోటు తీసుకోవాల్సిందే.. మందుల దుకాణాల్లో డిసెంబర్ 15వ తేదీ వరకు రూ.500 నోటు తీసుకోవాల్సిందే. ఎవరైనా తీసుకోకపోతే మాకు ఫిర్యాదు చేయవచ్చు. - ఎన్.యుగంధర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేయవచ్చు.. చిల్లర లేదని వైద్యం చేయనని అనడం సరికాదు. మానవతా ద్పక్పథంతోనైనా వైద్యం అందించాలి. ఆస్పత్రుల్లో రూ.500 నోటు తీసుకోకపోతే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. చర్యలు తీసుకుంటాం. - సి.పద్మజ, డీఎంహెచ్ఓ
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement